2000 Note: మీ వద్ద ఇంకా ₹2 వేల నోట్లున్నాయా.. ఈ రెండు మార్గాల్లో మార్చుకోండి..
2000 Note Exchange: 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ఆర్బీఐ మరో రెండు మార్గాలను సూచించింది. ఈ పద్ధతుల్లో క్యూ లైన్లో నిలబడకుండా, ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లకుండా నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయొచ్చు.
దిల్లీ: రెండు వేల రూపాయల నోట్ల (2000 Note) మార్పిడికి గడువు అక్టోబరు 7తో ముగిసింది. అయితే, ఇప్పటికీ కొంతమంది వద్ద ఈ నోట్లు ఉండటంతో వాటిని మార్చేందుకు తమ దగ్గర్లోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రాంతీయ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ₹2 వేల నోట్ల మార్పిడికి మరో రెండు మార్గాలను ఆర్బీఐ సూచించింది. మొదటి విధానంలో తాము నివసించే ప్రాంతానికి దగ్గర్లో ఆర్బీఐ కార్యాలయం లేని వాళ్లు బీమా చేసిన పోస్ట్ (Insured Post) సర్వీసు ద్వారా నోట్లను ఆర్బీఐకి పంపొచ్చు. రెండో విధానంలో ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి క్యూలో నిలబడకుండా టీఎల్ఆర్ (TLR) ఫామ్ ద్వారా ₹2 వేల నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది.
‘‘ఇంకా రెండు వేల నోట్లు ఉన్నవాళ్లు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బీమా చేసిన పోస్ట్ ద్వారా ఆర్బీఐకి పంపొచ్చు. ఇది సురక్షితమైన పద్ధతి. దీనివల్ల ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ దగ్గర్లో ఆర్బీఐ కార్యాలయం ఉంటే క్యూలో నిలబడకుండా టీఎల్ఆర్ ఫామ్తో ₹2 వేల నోట్లను మార్చుకోవచ్చు’’ అని దిల్లీ ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి దాస్ తెలిపారు.
ఏప్రిల్ నుంచి ‘హలో! యూపీఐ’.. వాయిస్ కమాండ్తోనే లావాదేవీలు!
టీఎల్ఆర్ ఫామ్ను ఆర్బీఐ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్ వద్ద పొందొచ్చు. ఫామ్పై బ్యాంకు ఖాతా వివరాలు, నోట్ల సంఖ్యను రాసి టీఎల్ఆర్ ఫామ్ డిపాజిట్ బాక్సులో వేయాలి. తర్వాత ఆర్బీఐ సిబ్బంది వాటిని ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇక పోస్ట్ ద్వారా పంపే కవర్లో నోట్లతోపాటు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన ఫామ్ను జతచేసి (ఈ ఫామ్ను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు) ఇన్సూరెన్స్ చేసి ఆర్బీఐ కార్యాలయానికి పంపొచ్చు.
వీటితోపాటు వ్యక్తిగతంగా ఆర్బీఐ కార్యాలయంలోని కౌంటర్ వద్ద రూ.20 వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చు. గతంలో నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు అక్టోబరు 7తో ముగిసింది. అక్టోబరు 8 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ₹2 వేల నోట్ల మార్చుకునేందుకు అనుమతించింది. ఇప్పటి వరకు 97 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ