2000 Note: మీ వద్ద ఇంకా ₹2 వేల నోట్లున్నాయా.. ఈ రెండు మార్గాల్లో మార్చుకోండి..
2000 Note Exchange: 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ఆర్బీఐ మరో రెండు మార్గాలను సూచించింది. ఈ పద్ధతుల్లో క్యూ లైన్లో నిలబడకుండా, ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లకుండా నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయొచ్చు.
దిల్లీ: రెండు వేల రూపాయల నోట్ల (2000 Note) మార్పిడికి గడువు అక్టోబరు 7తో ముగిసింది. అయితే, ఇప్పటికీ కొంతమంది వద్ద ఈ నోట్లు ఉండటంతో వాటిని మార్చేందుకు తమ దగ్గర్లోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రాంతీయ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ₹2 వేల నోట్ల మార్పిడికి మరో రెండు మార్గాలను ఆర్బీఐ సూచించింది. మొదటి విధానంలో తాము నివసించే ప్రాంతానికి దగ్గర్లో ఆర్బీఐ కార్యాలయం లేని వాళ్లు బీమా చేసిన పోస్ట్ (Insured Post) సర్వీసు ద్వారా నోట్లను ఆర్బీఐకి పంపొచ్చు. రెండో విధానంలో ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి క్యూలో నిలబడకుండా టీఎల్ఆర్ (TLR) ఫామ్ ద్వారా ₹2 వేల నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది.
‘‘ఇంకా రెండు వేల నోట్లు ఉన్నవాళ్లు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బీమా చేసిన పోస్ట్ ద్వారా ఆర్బీఐకి పంపొచ్చు. ఇది సురక్షితమైన పద్ధతి. దీనివల్ల ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ దగ్గర్లో ఆర్బీఐ కార్యాలయం ఉంటే క్యూలో నిలబడకుండా టీఎల్ఆర్ ఫామ్తో ₹2 వేల నోట్లను మార్చుకోవచ్చు’’ అని దిల్లీ ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి దాస్ తెలిపారు.
ఏప్రిల్ నుంచి ‘హలో! యూపీఐ’.. వాయిస్ కమాండ్తోనే లావాదేవీలు!
టీఎల్ఆర్ ఫామ్ను ఆర్బీఐ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్ వద్ద పొందొచ్చు. ఫామ్పై బ్యాంకు ఖాతా వివరాలు, నోట్ల సంఖ్యను రాసి టీఎల్ఆర్ ఫామ్ డిపాజిట్ బాక్సులో వేయాలి. తర్వాత ఆర్బీఐ సిబ్బంది వాటిని ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇక పోస్ట్ ద్వారా పంపే కవర్లో నోట్లతోపాటు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన ఫామ్ను జతచేసి (ఈ ఫామ్ను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు) ఇన్సూరెన్స్ చేసి ఆర్బీఐ కార్యాలయానికి పంపొచ్చు.
వీటితోపాటు వ్యక్తిగతంగా ఆర్బీఐ కార్యాలయంలోని కౌంటర్ వద్ద రూ.20 వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చు. గతంలో నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు అక్టోబరు 7తో ముగిసింది. అక్టోబరు 8 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ₹2 వేల నోట్ల మార్చుకునేందుకు అనుమతించింది. ఇప్పటి వరకు 97 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.