Indian Railway: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రైల్వేశాఖ ప్రణాళిక

Eenadu icon
By Business News Team Published : 31 Oct 2025 00:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Indian Railway | దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఉన్నత స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు రైల్వేశాఖ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఎక్కువ రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులతో పాటు ఆధునిక సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో చర్యలు ప్రారంభించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇటీవల దిల్లీ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి చర్యలు విజయవంతంగా పూర్తవడంతో, అదే తరహాలో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీపావళి, ఛఠ్‌ పూజ వంటి భారీ రద్దీ ఉన్న రోజుల్లో దిల్లీ స్టేషన్‌లో రైల్వే అధికారులు సజావుగా రద్దీని నిర్వహించగలిగారని రైల్వేశాఖ పేర్కొంది.

దిల్లీ స్టేషన్‌లో ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రదేశాల అభివృద్ధికి సుమారు నాలుగు నెలల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలను మాడ్యులర్ డిజైన్‌లో రూపొందించనున్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. 2026 పండగల సీజన్‌కు ముందే అన్ని హోల్డింగ్ ప్రాంతాల్లో పనులు పూర్తి చేయాలని రైల్వే మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎక్కువ రద్దీ ఉండే 76 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది. వాటిలో తెలుగు రాష్ట్రాల పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాచిగూడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి 7 ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సులభంగా నిర్వహించేందుకు, వారు వేచి ఉండే ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ  ప్రణాళికలు రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు