RBI dividend payout: కేంద్రానికి ఆర్బీఐ ‘డబుల్’ బొనాంజా.. డివిడెండ్ కింద ₹2.11 లక్షల కోట్లు
RBI dividend payout: కేంద్రానికి డివిడెండ్ రూపంలో రూ.2.11 లక్షల కోట్లు చెల్లించేందుకు ఆర్బీఐ నిర్ణయించింది.
RBI dividend payout | ముంబయి: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్గా (dividend payout) చెల్లించేందుకు నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈమేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. దీంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్ చెల్లిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది రూ.75,000-1,20,000 కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థిక వేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి చెల్లించేందుకు ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది. ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కంటిన్జెంట్ రిస్క్ బఫర్ లెవల్ను కూడా 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది.
‘ఏఐ’ని మనుషుల్లా చూడడం ఆపాలి: సత్య నాదెళ్ల
ఏటా ఆర్బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంటుంది. పెట్టుబడులు, డాలరు నిల్వలపై విలువల మధ్య వ్యత్యాసం, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు వంటి రూపాల్లో ఆర్బీఐకి ఆదాయం సమకూరుతుంటుంది. ఇందులో మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేస్తుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.1.02 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఒక్కటే అంచనాలకు మించి డివిడెండ్ ప్రకటించడమంటే ‘డబుల్’ బొనాంజా అనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి? -
వాణిజ్య రహస్యాలు దుర్వినియోగం కేసు.. టీసీఎస్కు ₹1,600 కోట్లు జరిమానా
TCS: వాణిజ్య రహస్యాలు బయటపెట్టారన్న కారణంతో అమెరికా డిస్ట్రిక్ కోర్ట్ టీసీఎస్కు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది. -
రుణ రేట్లను సవరించిన SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. MCLRను ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధులకు 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. -
56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం.. సంతోషంలో మస్క్ డ్యాన్స్
భారీ వేతన ప్యాకేజీకి ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపిన నేపథ్యంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) సంతోషంతో డ్యాన్స్ చేశారు. -
‘మౌస్ జిగ్లింగ్’ చేస్తున్నారని ఉద్యోగులపై కంపెనీ వేటు.. ఇంతకీ ఏంటిది?
Wells Fargo: మౌస్ జిగ్లింగ్ అంటే ఏంటి? ఈ చర్యకు పాల్పడిన వారిని వెల్స్ ఫార్గో ఎందుకు తొలగించింది? -
ఐపీఓకు హ్యుందాయ్ రెడీ.. సెబీకి పత్రాల సమర్పణ
Hyundai IPO: ఐపీఓ కోసం హ్యుందాయ్ మోటార్ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఆమోదం లభించడమే తరువాయి. -
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్తో తనకున్న అనుబంధం గురించి మరోసారి గుర్తుకుతెచ్చుకున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. -
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
Caller ID : ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తుల పేర్లు డిస్ప్లే అయ్యే కాలర్ ఐడీ సేవలపై టెలికాం కంపెనీలు పరిమిత స్థాయిలో ప్రయోగాలను ప్రారంభించాయి. -
ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డ్లు కొనుగోలు చేయొచ్చు..?
SIM Cards: మీ ఆధార్ నంబర్తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? అసలు ఒక్క ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయొచ్చు? -
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
తొలగించిన ఉద్యోగులకు అధికమొత్తం చెల్లించామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని మాజీ ఉద్యోగులకు ‘ఎక్స్’ నుంచి మెయిల్ వెళ్లింది. -
హ్యుందాయ్ రూ.25,000 కోట్ల ఐపీఓ
దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ తన భారత విభాగాన్ని పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు తీసుకురానుంది. కనీసం 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరణ నిమిత్తం త్వరలోనే మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. -
రిటైల్ మదుపర్లూ.. డబ్బులు పోతాయ్ జాగ్రత్త
చిన్న మదుపర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్కు దూరంగా ఉండాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్ హెచ్చరించారు. అందుకు బదులు మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మేలని సూచించారు. -
7 నెలల గరిష్ఠానికి దేశ వాణిజ్య లోటు
మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 7.7 శాతం అధికమై 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ఠమైన 23.78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
15 నెలల గరిష్ఠానికి టోకు ధరలు
మే నెలలో టోకు ధరలు 15 నెలల గరిష్ఠానికి చేరాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. తయారీ ఉత్పత్తులు ప్రియం కావడం కూడా మరో కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
దేశీయ విమాన ప్రయాణికులు 1.37 కోట్లు
ఈ ఏడాది మే నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.37 కోట్లుగా నమోదైనట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. 2023 మేలో ప్రయాణించిన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.4 శాతం ఎక్కువ. -
భారత్ అధిక వృద్ధికి ఆ 3 ‘ప్రతికూలతలే’ అడ్డంకి
భారత్ వేగంగా వృద్ధి చెందేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రపంచీకరణ నెమ్మదించడం, ప్రపంచ రాజకీయాల్లో విభజన, వాతావరణంలో మార్పుల రూపంలో మూడు ‘ప్రతికూలతల’ను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. -
కొత్త పల్సర్ ఎన్ 160 ఆవిష్కరణ
బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్160లో కొత్త వేరియంట్ను ఆవిష్కరించింది. ఇందులో ఇపుడున్న ఫీచర్లకు తోడు టర్న్-బై-టర్న్ నేవిగేషన్ను తన బ్లూటూత్ ఆధారిత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా తీసుకొచ్చింది. శాంపేన్ గోల్డ్ 33 ఎమ్ఎమ్ యూఎస్డీ ఫోర్క్స్ను సైతం కొత్తగా జత చేసింది. -
కొనసాగిన లాభాల జోరు
సూచీలు రికార్డుల జోరు కొనసాగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.55 వద్ద ముగిసింది. -
20,000 చిన్న సంస్థలకు రుణాల మంజూరు: ఎస్బీఐ
డిసెంబరులో ప్రారంభమైన డిజిటల్ రుణాల ప్రయోగాత్మక ప్రాజెక్ట్ భాగంగా చిన్న సంస్థలకు రూ.10-50 లక్షల వరకు దాదాపు 20,000 రుణాలు మంజూరు చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర రాణా తెలిపారు. -
ఆరోగ్య బీమాలోకి వచ్చే ప్రతిపాదనలు లేవు: ఎల్ఐసీ
ఆరోగ్య బీమా విభాగంలోకి రావాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి లేవని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. -
జెన్ఏఐ అంకురాలకు రూ.2,000 కోట్ల సహకారం
జెనరేటివ్ ఏఐ అంకుర సంస్థలకు 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సహకారం అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) తన ప్రణాళికగా పెట్టుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు