Reliance Industries: రిలయన్స్‌ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..

Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ పరంగా మరోసారి రూ.20లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.

Published : 27 Mar 2024 19:52 IST

Reliance Industries | దిల్లీ: ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance industries) అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్‌ విలువ పరంగా మరోసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో షేరు విలువ 3.60శాతం పెరిగి రూ.2,987.85 వద్ద గరిష్ఠాన్ని తాకడంతో ఈ ఘనత సాధించింది. ఇంట్రాడేలో షేరు 4శాతం పెరిగి 2,999.90 గరిష్ఠాన్ని తాకింది. 

మార్కెట్ విలువ పరంగా రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.70,039.26 కోట్లు పెరిగి రూ.20,21,486.59 కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈలో 4.71లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 81.63 లక్షల షేర్లు  ట్రేడయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తర్వాత దేశంలో అత్యంత విలువైన కంపెనీలుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 13,88,441.09 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ. 10,94,486.92 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (7,61,126.88 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (6,92,041.28 కోట్లు) నిలిచాయి. 

యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్‌..

ఈ ఏడాది ఫిబ్రవరి 13న మార్కెట్‌ విలువ పరంగా రూ.20 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది.     ఆ తర్వాత బుధవారం మరోసారి అదే మార్క్‌ను దాటింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు షేరు 15.59 శాతం పెరిగింది. బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట పట్టడంలో రిలయన్స్‌ కీలకపాత్ర పోషించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని