Reliance Jio: రిలయన్స్‌ జియో దీపావళి ధమాకా.. ఈ ప్లాన్‌లపై ₹3,350 విలువైన ప్రయోజనాలు

Eenadu icon
By Business News Team Updated : 25 Oct 2024 17:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) ‘దీపావళి ధమాకా’ ఆఫర్లను తీసుకొచ్చింది. పండగ సందర్భంగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో ఎంపిక చేసిన రీఛార్జీలపై రూ.3,350 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. నవంబర్‌ 3లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు.

దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.899, రూ.3,599 రీఛార్జి ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను జియో అందిస్తోంది. ఆఫర్‌ ముగిసేలోగా ఈ ప్లాన్‌లతో రీఛార్జి చేసుకుంటే రూ.3,000 విలువ చేసే ఈజీ మై ట్రిప్‌ వోచర్‌ అందిస్తోంది. విమాన ప్రయాణాలు, హోటల్‌ బుకింగ్స్‌ చేసుకొనే వారు ఈ వోచర్‌ వినియోగించుకోవచ్చు. రూ.999 కంటే ఎక్కువ మొత్తంతో అజియో వేదికగా కొనుగోలు చేసినప్పుడు రూ.200 విలువైన అజియో కూపన్‌ వర్తిస్తుంది. రూ.150 విలువైన స్విగ్గీ వోచర్‌ కూడా ఈ ప్లాన్లతో ఇస్తోంది. ‘మై జియో’ యాప్‌ సాయంతో కూపన్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఐపీఓకు ముందు స్విగ్గీ దూకుడు.. మరో కొత్త సేవలకు శ్రీకారం

జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్‌తో 90 రోజల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. జియో మరో ప్లాన్‌ రూ.3,599 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.

Tags :
Published : 25 Oct 2024 16:12 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు