Jio prepaid plans: జియో నుంచి న్యూఇయర్ ప్లాన్స్.. పూర్తి వివరాలు ఇవే!
Jio prepaid plans: రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్తగా రూ.2023 ప్లాన్ను తీసుకురాగా.. ఇది వరకే ఉన్న రూ.2999 ప్లాన్లో కొన్ని మార్పులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ 2023 పేరిట (Jio happy new year offer) ఈ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి రూ.2023 విలువతో తీసుకురాగా.. ఇప్పటికే ఉన్న రూ.2999 ప్లాన్లో కొన్ని మార్పులు చేసింది. ప్లాన్, వ్యాలిడిటీ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రూ.2023 ప్లాన్
2023 సంవత్సరాన్ని తెలియజేసే విధంగా రూ.2023 విలువతో రిలయన్స్ జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 252 రోజులు. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. ఈ ప్లాన్తో జియో యాప్స్ ఉచితంగా లభిస్తాయి. 28 రోజుల బిల్లింగ్ సైకిల్ను పరిగణనలోకి తీసుకుంటే.. 9 బిల్లింగ్ సైకిల్స్తో ఈ ప్లాన్ సమానం. అంటే నెలకు రూ.225 చొప్పున పడుతుంది.
రూ.2999 ప్లాన్
జియో ఎప్పటి నుంచో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తోంది. దీని కింద రోజుకు 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు వంద ఎస్సెమ్మెస్లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. మొత్తం 365 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్లో కొత్తగా కొన్ని మార్పులు చేశారు. ఏడాది వ్యాలిడిటీకి అదనంగా మరో 23 రోజుల అదనపు వ్యాలిడిటీని, 75జీబీ డేటాను జోడించారు. రిలయన్స్ జియోకు చెందిన ‘మై జియో’ యాప్తో పాటు ఇతర ఆన్లైన్ వేదికల ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. లాంగ్టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్న వారు ఈ రెండు ప్లాన్లను పరిశీలించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా