Russia Oil: 4 డాలర్లకు పడిపోనున్న రష్యా చమురు డిస్కౌంట్..!
భారత్కు ఇప్పటి వరకు చౌకగా లభించిన రష్యా చమురులో డిస్కౌంట్ మెల్లగా ఆవిరైపోతోంది. దీంతో చమురు ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా(Russia) నుంచి చౌకగా భారత్(India)కు లభిస్తున్న చమురు ధరల్లో మార్పులు రానున్నాయి. డిస్కౌంట్ 4 డాలర్లకు తగ్గిపోనున్నట్లు సమాచారం. మరోవైపు రష్యా ఏర్పాటు చేసిన చమురు రవాణా సంస్థల చార్జీలు మాత్రం ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. దీంతో దేశీయంగా చమురు ధరలపై ప్రతికూల ప్రభావం పడనుంది.
ప్రస్తుతం పశ్చిమ దేశాల ధరల నియంత్రణ కారణంగా పీపా చమురును రష్యా 60 డాలర్ల కంటే తక్కువ ధరకే భారత్కు విక్రయిస్తోంది. కానీ, బాల్టిక్, నల్లసముద్రం నుంచి భారత్లోని పశ్చిమ తీరానికి దీనిని చేర్చడానికి షిప్పింగ్ ఛార్జీలను పీపాకు 11 డాలర్ల నుంచి 19 డాలర్లు వసూలు చేస్తోంది. ఇది మార్కెట్ ధర కంటే చాలా అధికం. ఇందుకోసం రష్యా వద్ద ఉన్న 100కుపైగా ట్యాంకర్లలో కొన్నింటిని భారత్కు చమురు కోసం తీసుకొన్నారు. వీటికి అధికధరలను వసూలు చేస్తున్నారు.
గతేడాది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్కు యురల్ గ్రేడ్ చమురు సరఫరా పెరిగింది. ఈ క్రమంలో ప్రతిపీపా చమురుపై బ్రెంట్ క్రూడ్తో పోలిస్తే 30 డాలర్లకు పైగా డిస్కౌంట్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు అది మెల్లగా 4 డాలర్లకు తగ్గించేసింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని పెట్రోల్, డీజిల్ను తయారు చేస్తున్న అతిపెద్ద బయ్యర్లుగా భారత చమురు సంస్థలు ఎదిగాయి. మరోవైపు చైనాలో విద్యుత్తు వాహనాల వినియోగం పెరగడం, ఆ దేశ కొనుగోళ్లు ఇప్పటికే గరిష్ఠానికి చేరడంతో.. ఆ దేశం నుంచి కొత్త ఆర్డర్లలో పెరుగుదల లేదు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కేవలం 2శాతం మాత్రమే రష్యా చమురు కొనుగోలు చేసిన దేశీయ రిఫైనరీలు.. ఆ తర్వాత కొనుగోళ్లను 44 శాతానికి పెంచాయి. భారత్కు చెందిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్-మిత్తల్ ఎనర్జీ, రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి సంస్థలు ఈ చమురు కొనుగోళ్లకు ఒప్పందాలు చేసుకొంటున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు మొత్తం రష్యా చమురు దిగుమతుల్లో 60శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఈ సంస్థలు సమష్టిగా రష్యాతో బేరమాడితే డిస్కౌంట్ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. చైనా, ఐరోపా నుంచి చమురు కొనుగోళ్లు పెరిగే అవకాశం లేదు.
జీ-7 దేశాలు రష్యా చమురుపై 60 డాలర్ల ధర నియంత్రణను అమలు చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఈ ధర కంటే తక్కువకు చమురును కొనుగోలు చేసిన వారికే పశ్చిమ దేశాల షిప్పింగ్, బీమా సేవలు లభించాయి. రష్యా చమురు రవాణాకు ఐరోపా రిజిస్టర్డ్ ట్యాంకుల కంటే.. యూఏఈలో రిజిస్టరైన ట్యాంకులను అధికంగా వాడుతోంది. వీటి వినియోగం యుద్ధానికి ముందు 13శాతం ఉంటే.. 2023లో 37శాతానికి చేరింది. మరో వైపు చైనా, హాంకాంగ్ నౌకల వినియోగం 12 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!