Samsung: శాంసంగ్ S23 వచ్చేసింది.. ప్రీమియం మోడల్ ₹1,54,999.. స్పెసిఫికేషన్లు ఇవే..
Samsung galaxy s23 Price and other details: శాంసంగ్ నుంచి మరో మూడు ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభవుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ నుంచి ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. గెలాక్సీ సిరీస్లో ఎస్23 లైనప్లో మొత్తం మూడు ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ విడుదల చేసింది. గెలాక్సీ S23 (samsung galaxy s23), గెలాక్సీ S23+ (samsung galaxy s23+), గెలాక్సీ S23 అల్ట్రా (samsung galaxy s23 ultra) పేరిట వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి వీటి విక్రయాలు ఆరంభం కానున్నాయి. అల్ట్రా పేరిట తీసుకొస్తున్న మోడల్ అన్నింటి కంటే ప్రీమియం మోడల్. దీంట్లో 200 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.
ధరలు ఇలా..
గెలాక్సీ S23 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.74,999గా నిర్ణయించారు. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ.79,999గా పేర్కొన్నారు. గెలాక్సీ S23+ మోడల్ 8జీబీ+ 256 జీబీ వేరియంట్ ధరను రూ.94,999గా కంపెనీ పేర్కొంది. 8జీబీ+ 512జీబీ వేరియంట్ ధరను రూ.1,04,999గా నిర్ణయించింది. ఇక అన్నింటికంటే కాస్ట్లీ మోడల్ గెలాక్సీ S23 అల్ట్రా. ఇందులో మొత్తం మూడు వేరియంట్లు తీసుకొచ్చారు. ఈ మోడల్ 12జీబీ +256 జీబీ వేరియంట్ ధరను రూ.1,24,999గా నిర్ణయించారు. 12జీబీ+ 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,34,999గా పేర్కొన్నారు. 12జీబీ+1టీబీ వేరియంట్ ధరను రూ.1,54,999గా శాంసంగ్ పేర్కొంది.
మూడు మోడళ్ల విక్రయాలూ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్ ఆప్షన్ను శాంసంగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా అదనంగా రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కైబ్లూ రంగుల్లో దొరుకుతుంది. ఇవి కేవలం శాంసంగ్ వెబ్సైట్లోనే లభిస్తాయి. గెలాక్సీ ఎస్23 స్మార్ట్ఫోన్ భారత్లోనే తయారు చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. స్థానిక మార్కెట్ అవసరాలకు తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు వియత్నాంలోని శాంసంగ్ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. అక్కడి నుంచి భారత్కు దిగుమతి చేస్తున్నారు.
స్పెసిఫికేషన్లు..
- గెలాక్సీ S23 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్యూఐ 5.1తో వస్తోంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్, 120Hz రీఫ్రెష్ రేట్తో డిస్ప్లే అమర్చారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ను వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో కెమెరాను అమర్చారు. ముందు వైపు 12 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5జీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఐపీ68 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తున్నారు. 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్కు, 15W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
- గెలాక్సీ S23+ సైతం ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్యూఐ 5.1తో వస్తోంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ 120Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ను అమర్చారు. ఎస్23లో ఉన్న మూడు కెమెరాలనే ఇందులోనూ వినియోగించారు. బ్యాటరీ విషయానికొస్తే 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 45W వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్తోపాటు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.
- గెలాక్సీ S23 అల్ట్రా కూడా ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్యూఐ 5.1 తో వస్తోంది. 6.8 అంగుళాల క్యూహెచ్డీ డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ వినియోగించారు. ఇందులో 200 ప్రధాన కెమెరా అన్నింటి కంటే హైలైట్. దీంతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 10 ఎంపీ టెలీఫోటో లెన్స్ను వినియోగించారు. ముందు వైపు 12 ఎంపీ సెన్సర్ను వాడారు. ఇందులో ఎస్-పెన్ సదుపాయం ఇస్తున్నారు. స్టైలస్ను ఫోన్తో పాటే ఇస్తున్నారు. ఐపీ68 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్..
WWDC 2024: యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ తేదీలను ప్రకటించింది. -
‘ఎక్స్’ ప్రీమియంలో కొత్త ఫీచర్.. ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’కు యాక్సెస్
Social Media X: ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం ఎలాన్ మస్క్ మరో కొత్త ఫీచర్ను అందిస్తున్నారు. -
పోకో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫీచర్లు ఇవే..
Poco C61: పోకో తన ‘‘సీ’’ సిరీస్లో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. మార్చి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. -
లెనోవో నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్లు ఇవిగో..!
లెనోవో కంపెనీ కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. -
Airtel: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..
Airtel: ఎయిర్టెల్ త్వరలో టారిఫ్లను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది వ్యాలిడిటీతో ఈ టెలికాం సంస్థ అందిస్తున్న ప్లాన్లు ఏంటో చూద్దాం. ప్లాన్ల ధరలు పెరగక ముందే వీటితో రీఛార్జ్ చేసుకుంటే ఎంతో కొంత ఆదా అయ్యే అవకాశం ఉంది. -
టిక్టాక్పై నిషేధం ముప్పు.. అమెరికాలో బైట్ డ్యాన్స్ ‘కొత్త’ ప్లాన్!
టిక్టాక్పై నిషేధం ముప్పు పొంచి ఉన్న వేళ.. దాని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కొత్త స్కెచ్ వేసింది. కొత్త యాప్ను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. -
Snapchat: హోలీ వేళ స్నాప్చాట్ పిచికారీ లెన్స్.. ఎలా పనిచేస్తుందంటే?
Snapchat: సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు కొత్త లెన్స్లను తీసుకొచ్చే స్నాప్చాట్ తాజాగా హోలీ నేపథ్యంలో ఏఆర్ పిచికారీ అనే లెన్స్ను ప్రవేశపెట్టింది. -
Samsung: ఏఐ టూల్స్తో శాంసంగ్ కొత్త ల్యాప్టాప్
Samsung Laptop: ఫొటో రీమాస్టరింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి ఏఐ టూల్స్తో శాంసంగ్ కొత్త ల్యాప్టాప్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి. -
Lava O2: బడ్జెట్ ధరలో లావా కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే
Lava O2: లావా బడ్జెట్ ధరలో కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. -
Airtel: ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ఎమర్జెన్సీలో వ్యాలిడిటీ లోన్!
Airtel Validity Loan: ఇప్పటివరకు డేటాను మాత్రమే అప్పుగా ఇచ్చిన ఎయిర్టెల్ ఇకపై వ్యాలిడిటీని కూడా లోన్గా ఇవ్వనుంది. ప్లాన్ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. -
Reliance Jio: ఐపీఎల్ వేళ జియో కొత్త ప్లాన్.. రూ.49తో 25జీబీ డేటా
Reliance Jio: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త డేటా ప్లాన్ తీసుకొచ్చింది. -
WhatsApp: వాట్సప్ పిన్ ఫీచర్ మరింత మెరుగ్గా.. ఇకపై 3 మెసేజ్ల వరకు
WhatsApp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించే వాట్సప్ తాజాగా మరో అప్డేట్తో ముందుకొచ్చింది. పిన్ ఫీచర్ను మరింత మెరుగుపర్చినట్లు వెల్లడించింది. -
Ai pin: స్మార్ట్ డివైజ్తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్ అక్కర్లేదేమో!
Humane Ai Pin: హ్యూమన్ ఏఐ పిన్.. స్మార్ట్ఫోన్కు సవాలు విసురుతోంది. ఫోన్ చేయగలిగే అన్ని పనులూ చేసేస్తూ ఔరా అనిపిస్తోంది. -
Whatsapp: వాట్సప్ కొత్త ఫీచర్.. త్వరలో టెక్ట్స్ రూపంలోకి వాయిస్ మెసేజ్!
Whatsapp: వాట్సప్ వాయిస్ సందేశాలను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి పరిష్కారంగా దాన్ని టెక్ట్స్ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్ కొత్త ఫీచర్ను సిద్ధం చేస్తోంది. -
OnePlus 12R: వన్ప్లస్ 12ఆర్లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లివే..!
OnePlus 12R: జనవరిలో విడుదలైన వన్ప్లస్ 12ఆర్లో తాజాగా మరో కొత్త వేరియంట్ వచ్చింది. దాని ఫీచర్లు, ధర వివరాలను చూద్దాం..! -
Vivo T3: వివో కొత్త ఫోన్.. T3 5జీ స్పెసిఫికేషన్స్ ఇవే!
Vivo T3: వివో టీ3 పేరిట కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
AI జనరేటెడ్ వీడియోలు గుర్తించడం ఇకపై సులువు.. యూట్యూబ్ కొత్త రూల్స్
YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి సాయంతో యూజర్లు సులభంగా ఏఐ కంటెంట్, వాస్తవిక వీడియోల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. -
Jio AirFiber: ఎయిర్ఫైబర్ యూజర్లకు జియో ఆఫర్.. ఫ్రీగా ట్రిపుల్ డేటా స్పీడ్
Jio AirFiber data offer: ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్న వేళ ఎయిర్ ఫైబర్ యూజర్లకు జియో ఆఫర్ ప్రకటించింది. అధిక డేటా స్పీడ్ను ఆఫర్ చేస్తోంది. -
WhatsApp: త్వరలో వాట్సప్ స్టేటస్లో నిమిషం వీడియో!
WhatsApp: వాట్సప్లో ప్రస్తుతానికి 30 సెకన్ల వీడియోను మాత్రమే అప్లోడ్ చేయగలం. సుదీర్ఘ నిడివి గల వీడియోలను సైతం పోస్ట్ చేసేందుకు త్వరలో ఈ సామాజిక మాధ్యమం అవకాశం ఇవ్వనుంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో నాయిస్ జట్టు.. స్మార్ట్వాచ్తోనే పేమెంట్స్
Smart Watch: ఎయిర్టెల్ పేమెంట్స్, మాస్టర్కార్డ్తో కలసి నాయిస్ కొత్త స్మార్ట్వాచ్ను లాంచ్ చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. -
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
Vodafone Idea: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?