Samsung: శాంసంగ్ S23 వచ్చేసింది.. ప్రీమియం మోడల్ ₹1,54,999.. స్పెసిఫికేషన్లు ఇవే..
Samsung galaxy s23 Price and other details: శాంసంగ్ నుంచి మరో మూడు ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభవుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ నుంచి ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. గెలాక్సీ సిరీస్లో ఎస్23 లైనప్లో మొత్తం మూడు ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ విడుదల చేసింది. గెలాక్సీ S23 (samsung galaxy s23), గెలాక్సీ S23+ (samsung galaxy s23+), గెలాక్సీ S23 అల్ట్రా (samsung galaxy s23 ultra) పేరిట వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి వీటి విక్రయాలు ఆరంభం కానున్నాయి. అల్ట్రా పేరిట తీసుకొస్తున్న మోడల్ అన్నింటి కంటే ప్రీమియం మోడల్. దీంట్లో 200 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.
ధరలు ఇలా..
గెలాక్సీ S23 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.74,999గా నిర్ణయించారు. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ.79,999గా పేర్కొన్నారు. గెలాక్సీ S23+ మోడల్ 8జీబీ+ 256 జీబీ వేరియంట్ ధరను రూ.94,999గా కంపెనీ పేర్కొంది. 8జీబీ+ 512జీబీ వేరియంట్ ధరను రూ.1,04,999గా నిర్ణయించింది. ఇక అన్నింటికంటే కాస్ట్లీ మోడల్ గెలాక్సీ S23 అల్ట్రా. ఇందులో మొత్తం మూడు వేరియంట్లు తీసుకొచ్చారు. ఈ మోడల్ 12జీబీ +256 జీబీ వేరియంట్ ధరను రూ.1,24,999గా నిర్ణయించారు. 12జీబీ+ 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,34,999గా పేర్కొన్నారు. 12జీబీ+1టీబీ వేరియంట్ ధరను రూ.1,54,999గా శాంసంగ్ పేర్కొంది.
మూడు మోడళ్ల విక్రయాలూ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్ ఆప్షన్ను శాంసంగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా అదనంగా రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కైబ్లూ రంగుల్లో దొరుకుతుంది. ఇవి కేవలం శాంసంగ్ వెబ్సైట్లోనే లభిస్తాయి. గెలాక్సీ ఎస్23 స్మార్ట్ఫోన్ భారత్లోనే తయారు చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. స్థానిక మార్కెట్ అవసరాలకు తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు వియత్నాంలోని శాంసంగ్ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. అక్కడి నుంచి భారత్కు దిగుమతి చేస్తున్నారు.
స్పెసిఫికేషన్లు..
- గెలాక్సీ S23 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్యూఐ 5.1తో వస్తోంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్, 120Hz రీఫ్రెష్ రేట్తో డిస్ప్లే అమర్చారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ను వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో కెమెరాను అమర్చారు. ముందు వైపు 12 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5జీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఐపీ68 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తున్నారు. 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్కు, 15W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
- గెలాక్సీ S23+ సైతం ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్యూఐ 5.1తో వస్తోంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ 120Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ను అమర్చారు. ఎస్23లో ఉన్న మూడు కెమెరాలనే ఇందులోనూ వినియోగించారు. బ్యాటరీ విషయానికొస్తే 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 45W వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్తోపాటు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.
- గెలాక్సీ S23 అల్ట్రా కూడా ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్యూఐ 5.1 తో వస్తోంది. 6.8 అంగుళాల క్యూహెచ్డీ డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ వినియోగించారు. ఇందులో 200 ప్రధాన కెమెరా అన్నింటి కంటే హైలైట్. దీంతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 10 ఎంపీ టెలీఫోటో లెన్స్ను వినియోగించారు. ముందు వైపు 12 ఎంపీ సెన్సర్ను వాడారు. ఇందులో ఎస్-పెన్ సదుపాయం ఇస్తున్నారు. స్టైలస్ను ఫోన్తో పాటే ఇస్తున్నారు. ఐపీ68 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల