IPOs: వచ్చేవారం దలాల్ స్ట్రీట్ బిజీ బిజీ.. 6 ఐపీఓలు.. 5 లిస్టింగ్లు
IPOs: వచ్చే వారం రోజుల్లో మొత్తం ఆరు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి.
IPO | ముంబయి: వచ్చేవారం ఆరు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. రూ.3,300 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మూడు మెయిర్బోర్డ్ విభాగంలో కాగా.. మరో మూడు ఎస్ఎంఈ సెగ్మెంట్లో వస్తున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. మొత్తంగా వచ్చే వారం దలాల్ స్ట్రీట్లో సందడి వాతావరణం నెలకొననుంది.
ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపీఓ..
స్టెబిలైజర్ల తయారీ కంపెనీ ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపీఓ ఫిబ్రవరి 27-29 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.162-171గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.235.32 కోట్లు సమీకరించనుంది. మొత్తం కొత్త షేర్లను మాత్రమే ఐపీఓలో అందుబాటులో ఉన్నాయి.
ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ ఐపీఓ..
విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ వసతులను అందించే ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ రూ.429 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఫిబ్రవరి 27-29 మధ్య షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.135- 142గా నిర్ణయించారు. ఈవీ ఛార్జింగ్ విభాగంలో ఐపీఓకి వస్తున్న తొలి కంపెనీ ఇదే. రూ.329 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.100 కోట్లు విలువ చేసే వాటాలను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు.
భారత్ హైవేస్ ఇన్విట్ ఐపీఓ..
వచ్చేవారం మెయిన్బోర్డు సెగ్మెంట్లో భారత్ హైవేస్ ఇన్విట్ ఐపీఓ చివరిది. రూ.2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇది పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఫిబ్రవరి 28 ప్రారంభమై మార్చి 1న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.98-100గా నిర్ణయించారు.
ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ ఐపీఓ..
వచ్చేవారం ఎస్ఎంఈ సెగ్మెంట్లో వస్తున్న తొలి ఐపీఓ ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్. ఫిబ్రవరి 26-28 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.83-87. గరిష్ఠ ధర వద్ద రూ.42.7 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు.
పూర్వ్ ఫ్లెక్సీక్యాప్ ఐపీఓ..
ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పూర్వ్ ఫ్లెక్సీక్యాప్ ఐపీఓ ఫిబ్రవరి 27-29 మధ్య జరగనుంది. ధరల శ్రేణిని రూ.70-71గా నిర్ణయించారు. రూ.40.2 కోట్లు సమీకరించనున్నారు. కేవలం కొత్త షేర్లను మాత్రమే ఈ ఇష్యూలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లు లేవు.
ఎంవీకే అగ్రో ఫుడ్ ప్రోడక్ట్ ఐపీఓ..
ఎస్ఎంఈ సెగ్మెంట్లో రానున్న చివరి ఐపీఓ ఎంవీకే అగ్రో ఫుడ్ ప్రోడక్ట్. రూ.65.88 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఒక్కో షేరుకు రూ.120 ధరను నిర్ణయించింది. మొత్తం రూ.65.88 కోట్లు సమీకరించనుంది.
మరోవైపు రూ.525 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రారంభమైన జీపీటీ హెల్త్కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న ముగియనుంది. ఎస్ఎంఈ సెగ్మెంట్లో సాధవ్ షిప్పింగ్ ఇష్యూ ఫిబ్రవరి 27తో ముగుస్తోంది.
లిస్టింగ్లివే..
సరఫ్ హోటల్స్, హయత్ హోటల్స్ యాజమాన్యంలోని జునిపర్ హోటల్స్ షేర్లు ఫిబ్రవరి 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. రూ.1,800 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చిన ఈ సంస్థ షేర్లకు ఐపీఓలో 2.08 రెట్ల స్పందన లభించింది. మరోవైపు జీపీటీ హెల్త్కేర్ షేర్లు 29న ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. రెండో రోజు ముగిసే సమయానికి ఈ ఐపీఓకు 85 శాతం షేర్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. ఎస్ఎంఈ సెగ్మెంట్లో జెనిత్ డ్రగ్స్, డీమ్ రోల్ టెక్ షేర్లు ఫిబ్రవరి 27న, సాధవ్ షిప్పింగ్ మార్చి 1న లిస్ట్ కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్