IPOs: వచ్చేవారం దలాల్ స్ట్రీట్ బిజీ బిజీ.. 6 ఐపీఓలు.. 5 లిస్టింగ్లు
IPOs: వచ్చే వారం రోజుల్లో మొత్తం ఆరు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి.
IPO | ముంబయి: వచ్చేవారం ఆరు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. రూ.3,300 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మూడు మెయిర్బోర్డ్ విభాగంలో కాగా.. మరో మూడు ఎస్ఎంఈ సెగ్మెంట్లో వస్తున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. మొత్తంగా వచ్చే వారం దలాల్ స్ట్రీట్లో సందడి వాతావరణం నెలకొననుంది.
ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపీఓ..
స్టెబిలైజర్ల తయారీ కంపెనీ ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపీఓ ఫిబ్రవరి 27-29 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.162-171గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.235.32 కోట్లు సమీకరించనుంది. మొత్తం కొత్త షేర్లను మాత్రమే ఐపీఓలో అందుబాటులో ఉన్నాయి.
ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ ఐపీఓ..
విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ వసతులను అందించే ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ రూ.429 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఫిబ్రవరి 27-29 మధ్య షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.135- 142గా నిర్ణయించారు. ఈవీ ఛార్జింగ్ విభాగంలో ఐపీఓకి వస్తున్న తొలి కంపెనీ ఇదే. రూ.329 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.100 కోట్లు విలువ చేసే వాటాలను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు.
భారత్ హైవేస్ ఇన్విట్ ఐపీఓ..
వచ్చేవారం మెయిన్బోర్డు సెగ్మెంట్లో భారత్ హైవేస్ ఇన్విట్ ఐపీఓ చివరిది. రూ.2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇది పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఫిబ్రవరి 28 ప్రారంభమై మార్చి 1న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.98-100గా నిర్ణయించారు.
ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ ఐపీఓ..
వచ్చేవారం ఎస్ఎంఈ సెగ్మెంట్లో వస్తున్న తొలి ఐపీఓ ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్. ఫిబ్రవరి 26-28 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.83-87. గరిష్ఠ ధర వద్ద రూ.42.7 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు.
పూర్వ్ ఫ్లెక్సీక్యాప్ ఐపీఓ..
ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పూర్వ్ ఫ్లెక్సీక్యాప్ ఐపీఓ ఫిబ్రవరి 27-29 మధ్య జరగనుంది. ధరల శ్రేణిని రూ.70-71గా నిర్ణయించారు. రూ.40.2 కోట్లు సమీకరించనున్నారు. కేవలం కొత్త షేర్లను మాత్రమే ఈ ఇష్యూలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లు లేవు.
ఎంవీకే అగ్రో ఫుడ్ ప్రోడక్ట్ ఐపీఓ..
ఎస్ఎంఈ సెగ్మెంట్లో రానున్న చివరి ఐపీఓ ఎంవీకే అగ్రో ఫుడ్ ప్రోడక్ట్. రూ.65.88 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఒక్కో షేరుకు రూ.120 ధరను నిర్ణయించింది. మొత్తం రూ.65.88 కోట్లు సమీకరించనుంది.
మరోవైపు రూ.525 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రారంభమైన జీపీటీ హెల్త్కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న ముగియనుంది. ఎస్ఎంఈ సెగ్మెంట్లో సాధవ్ షిప్పింగ్ ఇష్యూ ఫిబ్రవరి 27తో ముగుస్తోంది.
లిస్టింగ్లివే..
సరఫ్ హోటల్స్, హయత్ హోటల్స్ యాజమాన్యంలోని జునిపర్ హోటల్స్ షేర్లు ఫిబ్రవరి 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. రూ.1,800 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చిన ఈ సంస్థ షేర్లకు ఐపీఓలో 2.08 రెట్ల స్పందన లభించింది. మరోవైపు జీపీటీ హెల్త్కేర్ షేర్లు 29న ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. రెండో రోజు ముగిసే సమయానికి ఈ ఐపీఓకు 85 శాతం షేర్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. ఎస్ఎంఈ సెగ్మెంట్లో జెనిత్ డ్రగ్స్, డీమ్ రోల్ టెక్ షేర్లు ఫిబ్రవరి 27న, సాధవ్ షిప్పింగ్ మార్చి 1న లిస్ట్ కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్