Paytm: పేటీఎం షేర్లను పూర్తిగా విక్రయించిన 6 మ్యూచువల్ ఫండ్లు!
Paytm: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేరు విలువ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో గత నెలలో కంపెనీ షేర్లను మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీగా విక్రయించాయి.
ముంబయి: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లను ఫిబ్రవరిలో ఆరు మ్యూచువల్ ఫండ్లు పూర్తిగా విక్రయించాయి. మరో ఆరు ఫండ్లు కంపెనీలో తమ వాటాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. మొత్తంగా గతనెలలో ఎంఎఫ్లు దాదాపు రూ.380 కోట్లు విలువ చేసే దాదాపు 91 లక్షల షేర్లను వదులుకున్నట్లు ‘మనీకంట్రోల్’ పేర్కొంది. ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం (Paytm) షేరు విలువ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతానికి 18 మ్యూచువల్ ఫండ్ల దగ్గర రూ.1,426 కోట్లు విలువ చేసే పేటీఎం షేర్లు ఉన్నాయి. జనవరిలో 24 ఫండ్లు రూ.3,384 కోట్ల షేర్లను హోల్డ్ చేశాయి. ఫిబ్రవరిలో మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ (15.16 లక్షల షేర్లు), క్వాంట్ ఎంఎఫ్ (6.13 లక్షల షేర్లు), బజాజ్ ఫిన్సర్వ్ ఎంఎఫ్ (2.1 లక్షల షేర్లు), జేఎం ఫైనాన్షియల్ ఎంఎఫ్ (1.67 లక్షల షేర్లు), యూనియన్ ఎంఎఫ్ (1.15 లక్షల షేర్లు), బరోడా బీఎన్పీ పరిబాస్ ఎంఎఫ్ (17,000 షేర్లు) పేటీఎం నుంచి పూర్తిగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.
మరోవైపు మోతీలాల్ ఓస్వాల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, యూటీఐ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, క్వాంట్, నిప్పన్ తమ వాటాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. ఫిబ్రవరిలో పేటీఎం షేరు విలువ 50 శాతానికి పైగా పడిపోయిన విషయం తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలే అందుకు కారణం. కంపెనీ షేరు బుధవారం (13 మార్చి 2014) ఉదయం 11:44 గంటల సమయంలో 5 శాతం నష్టపోయి రూ.350.95 దగ్గర ట్రేడవుతోంది.
‘ఎన్నికలపై నాకేం తెలియదు’.. గూగుల్ జెమిని సమాధానం!
ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఈనెల 15 నుంచి పీపీబీఎల్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదార్లు యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు, పేటీఎం యాప్ వాడటాన్ని కొనసాగించేందుకు వీలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) లైసెన్సును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 15లోగా ఆ మేరకు అనుమతులు రావొచ్చని సమాచారం. ఈ విషయంపై ఎన్పీసీఐ వర్గాలు, పేటీఎం స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే