ఏఐ స్కిల్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గిరాకీ.. వారికంటే 50% అధిక వేతనం!
AI: సాప్ట్వేర్ ఇంజినీర్ల కంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకున్నవారే 50 శాతం అధిక వేతనాలు పొందుతున్నారు. ఓ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
AI | ఇంటర్నెట్డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఉద్యోగులు సైతం ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి. వారికి అధికంగానే ముట్టజెబుతున్నాయి. సాధారణ ఇంజినీర్ల కంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నవారికి 50 శాతం అధిక వేతనం ఇస్తున్నారని తాజాగా ఓ నివేదికలో తేలింది. శాలరీ ట్రెండ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్లాట్ఫామ్ Levels.fyi విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
2024 ఏప్రిల్ నాటికి అమెరికాలో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వేతనం సగటున 3,00,000 డాలర్లు (రూ.2,49,31,650) దగ్గరగా ఉందని నివేదిక తెలిపింది. అంటే సాధారణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతంతో పోలిస్తే సుమారు 1,00,000 డాలర్ల మేర అధిక వేతనం పొందుతున్నారని పేర్కొంది. 2022లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు, ఏఐ స్కిల్స్ ఉన్న వారి వేతనం మధ్య అంతరం 30 శాతం ఉండగా.. అది 50 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. ఏఐకున్న డిమాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు టెకీలు ఈ సాంకేతికతను అందుపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక తెలియజేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బడా కంపెనీలు ఉన్నాయి.
‘మనకెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. ఏఐపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుత ఏఐ పోటీ ప్రపంచంలో ప్రతిభావంతుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న వారి కోసం కంపెనీలు పెద్ద మొత్తంలో జీతాలు, బోనస్లు అంటూ ప్రలోభపెడుతున్నాయి. మరోవైపు బడా టెక్ కంపెనీలు కొత్త టెక్నాలజీ అభివృద్ధికి గణనీయమైన పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఈ నిపుణులకు డిమాండ్ మరింత పెరగనుందని నివేదిక అభిప్రాయపడింది. ఏఐని అందిపుచ్చుకునే వారి అవకాశాలకు కొదవ ఉండదని ఇప్పటికే పలువురు నిపుణులు విశ్లేషించారు. ఇటీవల అదే విషయంపై ఇన్ఫోసిస్ సీటీఓ కూడా మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు, నాన్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఇంజినీర్లు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. దీన్ని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్