Stock market: ఆల్టైమ్ గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 1200 పాయింట్లు జంప్
Stock market closing bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1245 పాయింట్లు, నిఫ్టీ 356 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) భారీ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో సానుకూల వాతావరణం సూచీల పరుగుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 22,300 పాయింట్ల ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 72,606.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 73,819.21 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకి కొత్త రికార్డును నమోదు చేసిన సూచీ.. చివరికి 1245 పాయింట్ల లాభంతో 73,745.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 355.95 పాయింట్లు లాభంతో 22,338.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.90గా ఉంది. సెన్సెక్స్లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్టీ, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణించాయి. హెచ్సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 83.03 వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 2055.60 వద్ద ట్రేడవుతోంది.
‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదవడం, గనుల తవ్వకం, నిర్మాణరంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. మరోవైపు 2023-24 మొత్తం మీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావొచ్చని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. ఈ గణాంకాలు సూచీల్లో ఉత్సాహం నింపాయి.
- మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలూ దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. త్వరలో అమెరికాలో వడ్డీరేట్ల కోతపై ఫెడరల్ రిజర్వ్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం సైతం దిగొచ్చే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం అక్కడి మార్కెట్లు రాణించాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవగా.. యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించాయి.
- రేపు ప్రత్యేక సెషన్: ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహించనున్నాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ జరగనుంది. ప్రైమరీ సైట్లో ఏదైనా అవరోధం లేదా వైఫల్యం ఎదురైనప్పుడు సన్నద్ధతను తెలుసుకోవడానికి గానూ ఈ సెషన్ నిర్వహించనున్నట్లు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు ప్రైమరీ సైట్లో, 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య డిజాస్టర్ రికవరీ సైట్లో ఇంట్రాడే ట్రేడింగ్ నిర్వహించనున్నారు. స్పెషల్ సెషన్లో అన్ని సెక్యూరిటీ, డెరివేటివ్ ప్రొడక్ట్లు అందుబాటులో ఉంటాయని ఎక్స్ఛేంజీలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం