Gautam adani: అదానీ షేర్లు జూమ్.. కుబేరుల జాబితాలో టాప్-20లోకి అదానీ
Gautam adani: అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. టాప్-20లోకి చేరారు.
Gautam adani | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ (Gautam adani) ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ టాప్-20లోకి వచ్చారు. ఒకప్పుడు టాప్-3 స్థానాన్ని అందుకున్న ఆయన.. అమెరికాకు చెందిన షార్ట్సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ నివేదిక అనంతరం ఆ స్థానాన్ని కోల్పోయారు. నివేదిక అనంతరం కంపెనీ షేర్లు భారీగా పతనం కావడంతో ఏకంగా మూడో స్థానం నుంచి 30వ స్థానానికి చేరుకున్నారు. తాజాగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మళ్లీ రాణిస్తుండడంతో కుబేరుల జాబితాలో పైకి వచ్చారు.
బ్లూమ్బెర్గ్ ప్రపంచ కుబేరుల తాజా జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ 19వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 66.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా.. జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్-3లో కొనసాగుతున్నారు. భారత్కు చెందిన ముకేశ్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే గౌతమ్ అదానీ సంపద ఇంకా 53.8 బిలియన్ డాలర్లు తక్కువగానే ఉండడం గమనార్హం.
నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
అదానీ- హిండెన్బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు రాణిస్తున్నాయి. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలన్నిటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేద’ని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల్లో కొనుగోళ్ల మద్దుతు కనిపిస్తోంది. బుధవారం సైతం గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.33 వేల కోట్లు మేర పెరిగింది. మరోవైపు బ్లూమ్బెర్గ్ 500 కుబేరుల జాబితాలో భారత్ నుంచి షాపూర్ మిస్త్రీ, శివ్నాడార్, సావిత్రి జిందాల్, అజీమ్ ప్రేమ్జీ, రాధాకృష్ణ ధమానీ, ఉదయ్ కోటక్ వంటి వారు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!