స్విగ్గీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ క్యాష్బ్యాక్లో మార్పులు
Swiggy- HDFC Bank Credit: ప్రముఖ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తాను అందిస్తున్న కో బ్రాండ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో మార్పు తీసుకొచ్చింది.
Swiggy- HDFC Bank Credit | ఇంటర్నెట్డెస్క్: క్రెడిట్ కార్డులపై ప్రయోజనాల్లో మార్పులు తీసుకురానున్నట్లు ఇప్పటికే అనేక బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా అదే జాబితాలో చేరింది. స్విగ్గీతో కలసి అందిస్తున్న కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు అందిస్తున్న క్యాష్బ్యాక్ ఆఫర్లను అప్డేట్ చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త మార్పులు జూన్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు స్విగ్గీలో చేసే కొనుగోళ్లపై వచ్చే క్యాష్బ్యాక్ స్విగ్గీ మనీ వాలెట్లో జమయ్యేది. ఇకపై ఆ సదుపాయం ఉండదు. ఆ క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లో కనిపించనుంది. జూన్ 20 వరకు మాత్రం స్విగ్గీ మనీలోనే క్యాష్బ్యాక్ డిపాజిట్ అవుతాయి. కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అయిన 10 రోజుల తర్వాత క్యాష్బ్యాక్ క్రెడిట్ అయ్యేది. జూన్ 20 తర్వాత ఈ పద్ధతి మారనుంది. కార్డ్ స్టేట్మెంట్ ప్రతినెలా 15వ తేదీ జనరేట్ అవుతుంటే తరువాతి నెలలో ఆ క్యాష్బ్యాక్ కనిపిస్తుంది. ఉదాహరణకు.. జులై 15 నుంచి ఆగస్టు 14 మధ్య సంపాదించిన క్యాష్బ్యాక్ ఆగస్టు స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అంటే ఆ మేర తగ్గించి మిగిలిన మొత్తం చెల్లించుకోవచ్చు.
గూగుల్పేలో బై నౌ పే లేటర్.. కార్డు వివరాలు మరింత సేఫ్
ఇక ఈ కార్డు విషయానికొస్తే.. స్విగ్గీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (Swiggy- HDFC Bank Credit) క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఆన్లైన్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్, స్విగ్గీలో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఆ కార్డుతో చేసే ఆఫ్లైన్ చెల్లింపులపై కూడా క్యాష్బ్యాక్ పొందొచ్చు. కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత 3 నెలల పాటు వెల్కమ్ ఆఫర్ కింద స్విగ్గీ వన్ సభ్యత్వం ఇస్తోంది. కార్డు జాయినింగ్ ఫీ, పునరుద్ధరణ రుసుము రూ.500. ఏడాదిలో రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీ ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్