స్విగ్గీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ క్యాష్బ్యాక్లో మార్పులు
Swiggy- HDFC Bank Credit: ప్రముఖ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తాను అందిస్తున్న కో బ్రాండ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో మార్పు తీసుకొచ్చింది.
Swiggy- HDFC Bank Credit | ఇంటర్నెట్డెస్క్: క్రెడిట్ కార్డులపై ప్రయోజనాల్లో మార్పులు తీసుకురానున్నట్లు ఇప్పటికే అనేక బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా అదే జాబితాలో చేరింది. స్విగ్గీతో కలసి అందిస్తున్న కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు అందిస్తున్న క్యాష్బ్యాక్ ఆఫర్లను అప్డేట్ చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త మార్పులు జూన్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు స్విగ్గీలో చేసే కొనుగోళ్లపై వచ్చే క్యాష్బ్యాక్ స్విగ్గీ మనీ వాలెట్లో జమయ్యేది. ఇకపై ఆ సదుపాయం ఉండదు. ఆ క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లో కనిపించనుంది. జూన్ 20 వరకు మాత్రం స్విగ్గీ మనీలోనే క్యాష్బ్యాక్ డిపాజిట్ అవుతాయి. కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అయిన 10 రోజుల తర్వాత క్యాష్బ్యాక్ క్రెడిట్ అయ్యేది. జూన్ 20 తర్వాత ఈ పద్ధతి మారనుంది. కార్డ్ స్టేట్మెంట్ ప్రతినెలా 15వ తేదీ జనరేట్ అవుతుంటే తరువాతి నెలలో ఆ క్యాష్బ్యాక్ కనిపిస్తుంది. ఉదాహరణకు.. జులై 15 నుంచి ఆగస్టు 14 మధ్య సంపాదించిన క్యాష్బ్యాక్ ఆగస్టు స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అంటే ఆ మేర తగ్గించి మిగిలిన మొత్తం చెల్లించుకోవచ్చు.
గూగుల్పేలో బై నౌ పే లేటర్.. కార్డు వివరాలు మరింత సేఫ్
ఇక ఈ కార్డు విషయానికొస్తే.. స్విగ్గీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (Swiggy- HDFC Bank Credit) క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఆన్లైన్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్, స్విగ్గీలో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఆ కార్డుతో చేసే ఆఫ్లైన్ చెల్లింపులపై కూడా క్యాష్బ్యాక్ పొందొచ్చు. కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత 3 నెలల పాటు వెల్కమ్ ఆఫర్ కింద స్విగ్గీ వన్ సభ్యత్వం ఇస్తోంది. కార్డు జాయినింగ్ ఫీ, పునరుద్ధరణ రుసుము రూ.500. ఏడాదిలో రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీ ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు హ్యుందాయ్ రెడీ.. సెబీకి పత్రాల సమర్పణ
Hyundai IPO: ఐపీఓ కోసం హ్యుందాయ్ మోటార్ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఆమోదం లభించడమే తరువాయి. -
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్తో తనకున్న అనుబంధం గురించి మరోసారి గుర్తుకుతెచ్చుకున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. -
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
Caller ID : ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తుల పేర్లు డిస్ప్లే అయ్యే కాలర్ ఐడీ సేవలపై టెలికాం కంపెనీలు పరిమిత స్థాయిలో ప్రయోగాలను ప్రారంభించాయి. -
ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డ్లు కొనుగోలు చేయొచ్చు..?
SIM Cards: మీ ఆధార్ నంబర్తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? అసలు ఒక్క ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయొచ్చు? -
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
తొలగించిన ఉద్యోగులకు అధికమొత్తం చెల్లించామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని మాజీ ఉద్యోగులకు ‘ఎక్స్’ నుంచి మెయిల్ వెళ్లింది. -
హ్యుందాయ్ రూ.25,000 కోట్ల ఐపీఓ
దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ తన భారత విభాగాన్ని పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు తీసుకురానుంది. కనీసం 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరణ నిమిత్తం త్వరలోనే మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. -
రిటైల్ మదుపర్లూ.. డబ్బులు పోతాయ్ జాగ్రత్త
చిన్న మదుపర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్కు దూరంగా ఉండాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్ హెచ్చరించారు. అందుకు బదులు మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మేలని సూచించారు. -
7 నెలల గరిష్ఠానికి దేశ వాణిజ్య లోటు
మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 7.7 శాతం అధికమై 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ఠమైన 23.78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
15 నెలల గరిష్ఠానికి టోకు ధరలు
మే నెలలో టోకు ధరలు 15 నెలల గరిష్ఠానికి చేరాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. తయారీ ఉత్పత్తులు ప్రియం కావడం కూడా మరో కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
దేశీయ విమాన ప్రయాణికులు 1.37 కోట్లు
ఈ ఏడాది మే నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.37 కోట్లుగా నమోదైనట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. 2023 మేలో ప్రయాణించిన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.4 శాతం ఎక్కువ. -
భారత్ అధిక వృద్ధికి ఆ 3 ‘ప్రతికూలతలే’ అడ్డంకి
భారత్ వేగంగా వృద్ధి చెందేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రపంచీకరణ నెమ్మదించడం, ప్రపంచ రాజకీయాల్లో విభజన, వాతావరణంలో మార్పుల రూపంలో మూడు ‘ప్రతికూలతల’ను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. -
కొత్త పల్సర్ ఎన్ 160 ఆవిష్కరణ
బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్160లో కొత్త వేరియంట్ను ఆవిష్కరించింది. ఇందులో ఇపుడున్న ఫీచర్లకు తోడు టర్న్-బై-టర్న్ నేవిగేషన్ను తన బ్లూటూత్ ఆధారిత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా తీసుకొచ్చింది. శాంపేన్ గోల్డ్ 33 ఎమ్ఎమ్ యూఎస్డీ ఫోర్క్స్ను సైతం కొత్తగా జత చేసింది. -
కొనసాగిన లాభాల జోరు
సూచీలు రికార్డుల జోరు కొనసాగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.55 వద్ద ముగిసింది. -
20,000 చిన్న సంస్థలకు రుణాల మంజూరు: ఎస్బీఐ
డిసెంబరులో ప్రారంభమైన డిజిటల్ రుణాల ప్రయోగాత్మక ప్రాజెక్ట్ భాగంగా చిన్న సంస్థలకు రూ.10-50 లక్షల వరకు దాదాపు 20,000 రుణాలు మంజూరు చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర రాణా తెలిపారు. -
ఆరోగ్య బీమాలోకి వచ్చే ప్రతిపాదనలు లేవు: ఎల్ఐసీ
ఆరోగ్య బీమా విభాగంలోకి రావాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి లేవని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. -
జెన్ఏఐ అంకురాలకు రూ.2,000 కోట్ల సహకారం
జెనరేటివ్ ఏఐ అంకుర సంస్థలకు 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సహకారం అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) తన ప్రణాళికగా పెట్టుకుంది. -
సంక్షిప్తవార్తలు(5)
పెన్నా సిమెంట్కు ఉన్న రూ.3,000 కోట్ల రుణాలను తాము తీర్చేస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. పెన్నా సిమెంట్ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా తాజాగా వెల్లడించిన విషయం విదితమే. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
‘ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ ఇండియా’.. కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వ్యాఖ్యలు
-
‘డియర్ కామ్రేడ్’పై పోస్ట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. స్పందించిన రష్మిక
-
తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్ తీరు
-
ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
-
లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి
-
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ