Tata: బ్రిటన్లో టాటాల భారీ పెట్టుబడి.. సోమర్సెట్లో బ్యాటరీ ఫ్యాక్టరీ
యూకేలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది. ఇందుకు సోమర్సెట్ను వేదికగా ఎంచుకొంది.
ఇంటర్నెట్డెస్క్: యూకే (UK)లోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతం పేరును టాటా (Tata) అనుబంధ సంస్థ అగ్రటాస్ తొలిసారి వెల్లడించింది. సోమర్సెట్ వద్ద ఉన్న బ్రిడ్జ్వాటర్ సమీపంలో ఇప్పటికే ఉన్న ఓ కర్మాగారంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నాలుగు బిలియన్ పౌండ్లు (రూ.4.1 లక్షల కోట్లు) మేరకు పెట్టబడులు పెట్టనుంది. ఈ కొత్త ప్లాంట్లో సుమారు 4,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనాలున్నాయి. దీనిలో ఉత్పత్తి 2026 నుంచి ప్రారంభమవుతుంది.
సోమర్సెట్లోని రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆయుధ కర్మాగారం ఉన్న ప్రదేశాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని 2008లో మూసివేశారు. దీని భూమిలో 50శాతం అగ్రటాస్ కొనుగోలు చేసింది. 2030 నాటికి యూకే ఆటోమొబైల్ రంగానికి అవసరమైన సగం బ్యాటరీలను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఇది ఏటా 40 గిగావాట్ల సామర్థ్యమున్న సెల్స్ను తయారు చేస్తుంది. వీటిని దాదాపు 5,00,000 ప్యాసింజర్ వాహనాల్లో అమర్చవచ్చు.
ఈ కొత్త కర్మాగారం హింక్లీ పాయింట్ సీ అణు విద్యుత్ కేంద్రానికి 15.3 మైళ్ల దూరంలో ఉంటుంది. దీనిలో తొలుత జాగ్వర్, ల్యాండ్రోవర్ కార్లకు అవసరమైన బ్యాటరీలు తయారు చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన ఆటోమొబైల్ తయారీదార్లకు సరఫరా చేయాలన్నది ప్రణాళిక. ‘‘మేం కర్మాగారం నిర్మించే సమయంలో అన్ని కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తాం’’ అని అగ్రటాస్ సీఈవో టామ్ ఫ్లాక్ తెలిపారు. ఈ పరిణామాలపై సోమర్సెట్ వాణిజ్య మండలి సీఈవో ఎమ్మా రౌలింగ్స్ స్పందిస్తు స్థానికులకు మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.
సరికొత్త భారతానికి అంకురాలే వెన్నెముక
టాటా గ్రూప్ తమ దేశంలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుందని గతేడాదే యూకే ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తమ దేశంలో కార్ల తయారీ పరిశ్రమను బలోపేతం చేస్తుందని నాడు అభిప్రాయపడ్డారు. నెట్ జీరో వైపు అడుగులకు ఇది దోహదం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి