TATA Group IPO: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ?
TATA Group IPO: దాదాపు 20 ఏళ్ల తర్వాత గత ఏడాది టెక్ కంపెనీని ఐపీఓకి తెచ్చిన టాటా గ్రూప్.. తాజాగా మరో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
TATA Group IPO | ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ (TATA Group) మరో ఐపీఓకి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. విద్యుత్తు వాహన తయారీ కంపెనీ ‘టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM)’ ను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా 1-2 బిలియన్ డాలర్ల వరకు సమీకరించొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘బిజినెస్లైన్’ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 తొలినాళ్లలో ఐపీఓ ఉండొచ్చని సమాచారం.
టాటా మోటార్స్కు (TATA Motors) అనుంబంధంగా పనిచేస్తున్న టీపీఈఎం దేశంలో అతిపెద్ద విద్యుత్తు వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. నెక్సన్, టియాగో వంటి వాటిల్లో ఈవీ మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతానికి ప్రయాణికుల వాహన విభాగంలో దేశీయంగా ఈ కంపెనీదే 80 శాతం మార్కెట్ వాటా. 2023 జనవరిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ టీపీజీ నుంచి టీపీఈఎం 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. అప్పటికి కంపెనీ విలువ 9.5- 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2026 నాటికి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంలో భాగంగా ఈ మొత్తం సమకూర్చుకుంది.
2023-24లో టాటా మోటార్స్ (TATA Motors) 53,000 విద్యుత్తు కార్లను విక్రయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష వాహనాల వరకు అమ్ముడవుతాయని అంచనా. 2024 జనవరిలో కంపెనీ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 69 శాతం పుంజుకొని 6,979 యూనిట్లకు చేరాయి. వచ్చే 3 - 4 ఏళ్లలో మొత్తం 10 మోడళ్లలో విద్యుత్తు కార్లను తీసుకురావాలని యోచిస్తోంది. టాటా నెక్సాన్.ఈవీ ధర ఇప్పుడు రూ.14.49 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. టియాగో.ఈవీ రూ.7.9 లక్షల నుంచి లభిస్తోంది. నెక్సాన్పై రూ.1.2 లక్షల వరకు తగ్గగా.. టియాగోపై రూ.70,000 వరకు రాయితీ ఇస్తోంది.
గత ఏడాది టాటా టెక్ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ గ్రూప్ నుంచి వచ్చిన పబ్లిక్ ఇష్యూ ఇది. అంతా ఊహించినట్లుగానే దీనికి భారీ స్పందన లభించింది. రూ.3042 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఇష్యూలో 4.5 కోట్ల షేర్లు సబ్స్క్రిప్షన్కు ఉంచగా.. 69.4 రెట్ల స్పందన లభించింది. ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ.500గా నిర్ణయించగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.1,200 దగ్గర లిస్టయ్యింది. సోమవారం (2024 జనవరి 26) మధ్యాహ్నం 12:33 గంటలకు షేరు విలువ రూ.1,101 దగ్గర ట్రేడవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్