TATA Group IPO: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ?
TATA Group IPO: దాదాపు 20 ఏళ్ల తర్వాత గత ఏడాది టెక్ కంపెనీని ఐపీఓకి తెచ్చిన టాటా గ్రూప్.. తాజాగా మరో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
TATA Group IPO | ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ (TATA Group) మరో ఐపీఓకి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. విద్యుత్తు వాహన తయారీ కంపెనీ ‘టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM)’ ను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా 1-2 బిలియన్ డాలర్ల వరకు సమీకరించొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘బిజినెస్లైన్’ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 తొలినాళ్లలో ఐపీఓ ఉండొచ్చని సమాచారం.
టాటా మోటార్స్కు (TATA Motors) అనుంబంధంగా పనిచేస్తున్న టీపీఈఎం దేశంలో అతిపెద్ద విద్యుత్తు వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. నెక్సన్, టియాగో వంటి వాటిల్లో ఈవీ మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతానికి ప్రయాణికుల వాహన విభాగంలో దేశీయంగా ఈ కంపెనీదే 80 శాతం మార్కెట్ వాటా. 2023 జనవరిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ టీపీజీ నుంచి టీపీఈఎం 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. అప్పటికి కంపెనీ విలువ 9.5- 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2026 నాటికి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంలో భాగంగా ఈ మొత్తం సమకూర్చుకుంది.
2023-24లో టాటా మోటార్స్ (TATA Motors) 53,000 విద్యుత్తు కార్లను విక్రయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష వాహనాల వరకు అమ్ముడవుతాయని అంచనా. 2024 జనవరిలో కంపెనీ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 69 శాతం పుంజుకొని 6,979 యూనిట్లకు చేరాయి. వచ్చే 3 - 4 ఏళ్లలో మొత్తం 10 మోడళ్లలో విద్యుత్తు కార్లను తీసుకురావాలని యోచిస్తోంది. టాటా నెక్సాన్.ఈవీ ధర ఇప్పుడు రూ.14.49 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. టియాగో.ఈవీ రూ.7.9 లక్షల నుంచి లభిస్తోంది. నెక్సాన్పై రూ.1.2 లక్షల వరకు తగ్గగా.. టియాగోపై రూ.70,000 వరకు రాయితీ ఇస్తోంది.
గత ఏడాది టాటా టెక్ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ గ్రూప్ నుంచి వచ్చిన పబ్లిక్ ఇష్యూ ఇది. అంతా ఊహించినట్లుగానే దీనికి భారీ స్పందన లభించింది. రూ.3042 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఇష్యూలో 4.5 కోట్ల షేర్లు సబ్స్క్రిప్షన్కు ఉంచగా.. 69.4 రెట్ల స్పందన లభించింది. ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ.500గా నిర్ణయించగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.1,200 దగ్గర లిస్టయ్యింది. సోమవారం (2024 జనవరి 26) మధ్యాహ్నం 12:33 గంటలకు షేరు విలువ రూ.1,101 దగ్గర ట్రేడవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా