Tesla: భారత్లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామి

Tesla | ఇంటర్నెట్డెస్క్: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యాఖ్యానించారు. కానీ, దేశీయంగా షోరూమ్లు ఏర్పాటు చేసే ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్లో విద్యుత్తు కార్ల తయారీని ప్రోత్సహిస్తూ కేంద్ర తీసుకొచ్చిన పథకానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియజేస్తూ ఈ విషయాన్ని చెప్పారు.
‘‘టెస్లా కేవలం షోరూమ్లు ఏర్పాటుకు మాత్రమే ఆసక్తిగా ఉంది. భారత్లో తయారీకి ఇష్టపడటంలేదు. తయారీ దిశగా ఆ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆసక్తి వెల్లడికాలేదు. భారత్ విద్యుత్తు కార్ల తయారీ ప్రోత్సాహక స్కీమ్లోని భాగస్వాముల సమావేశంలో టెస్లా ప్రతినిధులు తొలి రౌండ్కు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత జరిగి రెండు, మూడో రౌండ్ చర్చల్లో ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొనలేదు’’ అని కుమార స్వామి పేర్కొన్నారు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్లో మస్క్ భారత్లో పర్యటించాల్సి ఉండగా.. కంపెనీ పనులతో ఆయన పర్యటన రద్దైంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, మస్క్ ఫాక్స్ న్యూస్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. సుంకాలతో మా నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంతో ఎలాన్ మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోంది. ఉదాహరణ భారతే..! ఇప్పుడు ఆయన (మస్క్) భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావొచ్చు.. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక భారత ప్రధాని మోదీతో భేటీని నాడు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. విద్యుత్ కార్లపై అధిక సుంకాల విషయాన్ని మోదీతో ప్రస్తావించినట్లు తెలిపారు. సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కూడా భారత్లో కార్యకలాపాలు విస్తరించడానికి ట్రంప్ ఇష్టపడలేదు. భారత్లో తయారైన ఫోన్లు అమెరికా విక్రయించాలంటే 25శాతం అదనపు సుంకం చెల్లించాల్సిందే అని యాపిల్కు తేల్చిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. - 
                                    
                                        

హిందుజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
Hinduja Group Chairman: ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. - 
                                    
                                        

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. - 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
Billionaires: ఆర్థిక అసమానతల వల్ల దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చవిచూస్తాయని జీ20 నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


