UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది.
UCO bank | దిల్లీ: యూకో బ్యాంక్ కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి అనూహ్యంగా డబ్బులు జమ అయిన ఘటనలో సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. రూ.820 కోట్లు పొరపాటున బదిలీ ఘటనలో.. సరిగ్గా అవే తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు ఆ సంస్థ దృష్టి సారించింది. నవంబర్ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్కు చెందిన 41 వేల మంది కస్టమర్ల ఖాతాల్లో పొరపాటున డబ్బులు జమ అయిన సంగతి తెలిసిందే. బదిలీ చేసిన ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ కట్ అవ్వకుండానే యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. దీనిపై బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ప్రస్తుతం దీనిపై కూపీ లాగుతోంది.
బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై సీబీఐ అనుమానం వ్యక్తంచేస్తోంది. లావాదేవీలు జరిగిన తేదీల్లోనే ఆయా ఖాతాలు ఎలా తెరుచుకున్నాయనే దానిపై ఇప్పుడు సీబీఐ ఆరా తీస్తోంది. పొరపాటున జమ అయిన మొత్తాలను చాలా మంది ఇదే అదునుగా విత్డ్రా చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. నేరపూరిత ఉద్దేశంతో ఎవరెవరైతే డబ్బులు విత్ డ్రా చేసుకున్నారో వారు తమ దర్యాప్తు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీఐ పేర్కొంది. మోసపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించి లబ్ధి పొందిన వారిపైనే తాము దృష్టి సారించామని స్పష్టంచేసింది.
రూ.820 కోట్ల IMPS లావాదేవీలు.. 13చోట్ల సీబీఐ సోదాలు
ఇదే అదునుగా కొందరు నేరగాళ్లు దర్యాప్తు అధికారులమంటూ ఖాతాదారుల్ని మోసగించే అవకాశం ఉందని సీబీఐ అప్రమత్తం చేసింది. కేసుకు సంబంధించిన వివరాల కోసం సీబీఐ ఏ ఒక్కరికీ ఫోన్ కాల్స్ చేయబోదని, ఒకవేళ ఎవరైనా అలా కాల్ చేస్తే సీబీఐని సంప్రదించాలని సూచించింది. రాజస్థాన్లో అత్యధికంగా 230 శాఖల పరిధిలో 28వేల ఖాతాలకు 7.50 లక్షల లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఆయా లావాదేవీల రూపంలో మొత్తం రూ.760 కోట్లు జమ అయ్యింది. అలాగే, కర్ణాటకలో రూ.3.40 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.2.60 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజినీర్లు, గుర్తు తెలీని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇటీవల వివిధ చోట్ల జరిపిన సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, డెబిట్, క్రెడిట్ కార్డు వంటి ఎలక్ట్రానిక్ ఆధారాలను సీబీఐ సేకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..