UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది.
UCO bank | దిల్లీ: యూకో బ్యాంక్ కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి అనూహ్యంగా డబ్బులు జమ అయిన ఘటనలో సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. రూ.820 కోట్లు పొరపాటున బదిలీ ఘటనలో.. సరిగ్గా అవే తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు ఆ సంస్థ దృష్టి సారించింది. నవంబర్ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్కు చెందిన 41 వేల మంది కస్టమర్ల ఖాతాల్లో పొరపాటున డబ్బులు జమ అయిన సంగతి తెలిసిందే. బదిలీ చేసిన ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ కట్ అవ్వకుండానే యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. దీనిపై బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ప్రస్తుతం దీనిపై కూపీ లాగుతోంది.
బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై సీబీఐ అనుమానం వ్యక్తంచేస్తోంది. లావాదేవీలు జరిగిన తేదీల్లోనే ఆయా ఖాతాలు ఎలా తెరుచుకున్నాయనే దానిపై ఇప్పుడు సీబీఐ ఆరా తీస్తోంది. పొరపాటున జమ అయిన మొత్తాలను చాలా మంది ఇదే అదునుగా విత్డ్రా చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. నేరపూరిత ఉద్దేశంతో ఎవరెవరైతే డబ్బులు విత్ డ్రా చేసుకున్నారో వారు తమ దర్యాప్తు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీఐ పేర్కొంది. మోసపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించి లబ్ధి పొందిన వారిపైనే తాము దృష్టి సారించామని స్పష్టంచేసింది.
రూ.820 కోట్ల IMPS లావాదేవీలు.. 13చోట్ల సీబీఐ సోదాలు
ఇదే అదునుగా కొందరు నేరగాళ్లు దర్యాప్తు అధికారులమంటూ ఖాతాదారుల్ని మోసగించే అవకాశం ఉందని సీబీఐ అప్రమత్తం చేసింది. కేసుకు సంబంధించిన వివరాల కోసం సీబీఐ ఏ ఒక్కరికీ ఫోన్ కాల్స్ చేయబోదని, ఒకవేళ ఎవరైనా అలా కాల్ చేస్తే సీబీఐని సంప్రదించాలని సూచించింది. రాజస్థాన్లో అత్యధికంగా 230 శాఖల పరిధిలో 28వేల ఖాతాలకు 7.50 లక్షల లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఆయా లావాదేవీల రూపంలో మొత్తం రూ.760 కోట్లు జమ అయ్యింది. అలాగే, కర్ణాటకలో రూ.3.40 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.2.60 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజినీర్లు, గుర్తు తెలీని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇటీవల వివిధ చోట్ల జరిపిన సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, డెబిట్, క్రెడిట్ కార్డు వంటి ఎలక్ట్రానిక్ ఆధారాలను సీబీఐ సేకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి