Uday Kotak: కోటక్ బ్యాంక్ సీఈఓ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా.. 4 నెలల ముందే!
Uday Kotak Stepdown: కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓగా ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగానే ఈ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దిల్లీ: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా (Kotal Mahindra Bank) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవి నుంచి ఉదయ్ కోటక్ (Uday Kotak) వైదొలిగారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్సెంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. వాస్తవానికి ఉదయ్ కోటక్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉంది. నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. తాత్కాలిక ఎండీగా ప్రస్తుత జాయింట్ ఎండీ దీపక్ గుప్తా వ్యవహరించనున్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పదవికి రాజీనామా చేస్తూ ఉదయ్ కోటక్ బ్యాంక్ బోర్డుకు లేఖ రాశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా గడువు ఉన్నప్పటికీ ఇదే సరైన సమయం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా తనతో పాటు ఛైర్మన్, జాయింట్ ఎండీ రాజీనామా చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సులువుగా అధికార మార్పిడి జరగాలన్న ఉద్దేశంతో తాను స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉదయ్ కోటక్ తన లేఖలో పేర్కొన్నారు.
సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ కడుతున్నారా?.. నెలాఖరులో ఇది పూర్తి చేయండి!
1985లో ఎన్బీఎఫ్సీని స్థాపించిన ఉదయ్ కోటక్.. 2003 నాటికి పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాంక్గా తీరిదిద్దారు. ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్గా ఉంది. సీఈఓగా వైదొలగనున్నప్పటికీ.. బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉదయ్ కోటక్ కొనసాగనున్నారు. ఏదైనా బ్యాంక్కు సీఈఓగా 15 ఏళ్లకు మించి ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పదవీకాలం ముగియకముందే ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. 2024 జనవరి 1 తర్వాత కోటక్ బ్యాంక్కు కొత్త సీఈవో రానున్నారు.
రాజీనామా లేఖలో ఏం చెప్పారంటే?
‘‘ఈ సంస్థను స్థాపించి 38 ఏళ్లు అయ్యింది. ముంబయిలో ముగ్గురితో ప్రారంభించిన ఈ సంస్థ.. ఇవాళ ప్రముఖ బ్యాంకుగా అవతరించింది. భారత్తో పాటు మరో ఐదు దేశాల్లో లక్ష మంది ఉద్యోగులతో సేవలందిస్తోంది. ఈ మొత్తం ప్రయాణం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవి నుంచి వైదొలగడానికి కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ.. కొన్ని రోజులుగా దీనిపై ఆలోచన చేస్తున్నా. ఇప్పుడే సరైన సమయం అని భావించి వైదొలుగుతున్నా. వారసత్వ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే బ్యాంక్ పలు చర్యలు తీసుకుంది. ఈ విషయంలో ఆర్బీఐ నిర్ణయం ఎదురుచూస్తున్నాం. రాబోయే కొన్ని నెలల పాటు నా సమయాన్ని వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమాలకు కేటాయించాలనుకుంటున్నా. కొన్ని నెలల్లో పెద్ద కుమారుడి పెళ్లి ఉంది. బ్యాంక్ పట్ల ప్రజల విశ్వాసం మున్ముందూ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నా. సీఈఓగా వైదొలగినప్పటికీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగుతా. ఈ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొంటూ బోర్డు ఛైర్మన్కు ప్రకాశ్ ఆప్టేకు సొంత దస్తూరితో ఉదయ్ కోటక్ లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్