అందుకోసమే అన్సెక్యూర్డ్ లోన్లపై నిర్ణయం: ఆర్బీఐ గవర్నర్
RBI on Unsecured loans: సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని అన్సెక్యూర్డ్ లోన్లపై ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ముంబయి: వ్యక్తిగత రుణాలపై రిస్క్ వెయిట్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమర్థించుకున్నారు. సుస్థిరత సాధించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకునే గృహ, వాహన రుణాలను అందులోంచి మినహాయించినట్లు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FICCI), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సుస్థిరత సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ముందస్తుగా అన్సెక్యూర్డ్ రుణాలపై నిర్ణయం తీసుకున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడీ లేదని, అయినప్పటికీ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోందని చెప్పారు. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ అధికంగా ఉన్నప్పటికీ.. రూపాయి స్వల్ప స్థాయిలోనే ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. దేశీయంగా రూపాయి విలువ క్షీణించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధరల ఒత్తిడిని అధిగమించాలంటే అగ్రికల్చర్ మార్కెటింగ్లో సంస్కరణలు అవసరం అని అభిప్రాయపడ్డారు.
ఓపెన్ఏఐలో కొత్త ట్విస్ట్.. సీఈఓగా తిరిగి రానున్న శామ్ ఆల్ట్మన్
వ్యక్తిగత రుణాల విషయంలో ఆర్బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు ఈ తరహా రుణాలిచ్చేందుకు ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. హామీలేని వ్యక్తిగత రుణాలకు రిస్క్ వెయిట్ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ సవరించిన నిబంధనలు గృహ, విద్య, వాహన రుణాలను ఇందులోంచి మినహాయించింది. పసిడి, పసిడి ఆభరణాల తనఖాపై తీసుకునే రుణాలకూ వర్తించవని స్పష్టం చేసింది. అలాగ, క్రెడిట్ కార్డు రుణాల విషయంలోనూ రిస్క్ వెయిట్ను 25 పర్సెంటేజీ పాయింట్లు పెంచి ప్రస్తుత 125 శాతం నుంచి 150 శాతానికి ఆర్బీఐ చేర్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం