Sam Altman: ఓపెన్ఏఐలో కొత్త ట్విస్ట్.. సీఈఓగా తిరిగి రానున్న శామ్ ఆల్ట్మన్
Sam Altman: ఓపెన్ఏఐ సీఈఓగా ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్మన్ తిరిగి ఆ బాధ్యతల్లోకి రానున్నారు. ఈ మేరకు ఓ ఒప్పందం కుదిరినట్లు కంపెనీ ప్రకటించింది.
Sam Altman | శాన్ఫ్రాన్సిస్కో: చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ (Sam Altman) తొలగింపుతో ఓపెన్ఏఐలో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. ఆల్ట్మన్ తిరిగి ఓపెన్ఏఐ (OpenAI)కి రానున్నారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే కంపెనీకి కొత్త బోర్డు సైతం రానున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆల్ట్మన్ (Sam Altman) సైతం ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు.
ఆల్ట్మన్ (Sam Altman) తొలగింపు తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్ఏఐ (OpenAI)లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఆయనకు మద్దతుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కంపెనీలో చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేస్తామని హెచ్చరించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మరోవైపు ఇన్వెస్టర్లు సైతం ఆల్ట్మన్ (Sam Altman)ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
సేల్స్ఫోర్స్ మాజీ కో-సీఈఓ బ్రెట్ టేలర్ అధ్యతన అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, కోరా సీఈఓ ఆడమ్ డీ-ఏంజిలోతో కూడిన కొత్త బోర్డు ఏర్పాటు కానున్నట్లు ఓపెన్ఏఐ (OpenAI) వెల్లడించింది. తాజా నిర్ణయంపై ఆల్ట్మన్ స్పందిస్తూ.. ఓపెన్ఏఐ అంటే తనకెంతో ఇష్టమన్నారు. కంపెనీ లక్ష్యాన్ని, దాని కోసం శ్రమిస్తున్న బృందాన్ని నిలిపి ఉంచడం కోసమే తాను గతకొన్ని రోజులుగా నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ఓపెన్ఏఐకి తిరిగొచ్చి మైక్రోసాఫ్ట్తో బలమైన బంధాన్ని నెలకొల్పడానికి ఆసక్తిగా ఉన్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఓపెన్ఏఐ తొలగింపు తర్వాత ఆల్ట్మన్ (Sam Altman)ను తమ కొత్త ఏఐ పరిశోధన బృందంలోకి తీసుకుంటున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓపెన్ఏఐ (OpenAI)తో తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆల్ట్మన్ తిరిగి ఓపెన్ఏఐకి రావడాన్ని తాను స్వాగతిస్తానని నాదెళ్ల పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.
వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆల్ట్మన్ (Sam Altman)ను తిరిగి తీసుకురావడానికి తొలుత ఓపెన్ఏఐ (OpenAI) చేసిన యత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. బోర్డు తొలగింపు సహా తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆల్ట్మన్ షరతులు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన డిమాండ్ల మేరకు.. బోర్డు పునర్నిర్మాణం జరిగినట్లు తాజా పరిణామాలతో స్పష్టమైంది.
ఇది తొలి అడుగు..
ఆల్ట్మన్ పునరాగమనంపై సత్య నాదెళ్ల స్పందించారు. ఓపెన్ఏఐ బోర్డులో మార్పులు తమను ఉత్సాహపరిచాయన్నారు. మరింత స్థిరమైన, ప్రభావవంతమైన పాలనా విధానాలకు అవసరమైన తొలి అడుగు ఇదేనని తెలిపారు. దీనిపై ఆల్ట్మన్, బ్రాక్మన్తో చర్చించినట్లు పేర్కొన్నారు. ఓపెన్ఏఐ నాయకత్వంతో పాటు వారికి కంపెనీలో కీలక స్థానం ఉంటుందని తెలిపారు. తద్వారా సంస్థ లక్ష్యం నిరాటంకంగా ముందుకు సాగుతుందన్నారు. తమ భాగస్వాములు, కస్టమర్లకు విలువతో కూడిన ఏఐని అందించేందుకు ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ బంధం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..