KYC update: బ్యాంకులు రీ కేవైసీ అడుగుతున్నాయా? ఆన్లైన్లో సులువుగా చేసుకోండిలా..
KYC update: బ్యాంకులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తరచూ చెబుతుంటాయి. సులువుగా మీరే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
KYC update | ఇంటర్నెట్డెస్క్: బ్యాంకులో ఖాతా ఉన్నా.. మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నా.. ఇతర ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరగాలన్నా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. కస్టమర్ల ఖాతాకు భద్రతను పెంచడంతో పాటు, మోసాలను నివారించడంలో భాగంగా బ్యాంకులు కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కోరుతుంటాయి. ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు కేవైసీ వివరాలు ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. బ్యాంక్ పోర్టల్లోకి వెళ్లి సులువుగా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంకును బట్టి ఈ ప్రక్రియలో చిన్న చిన్న మార్పులుంటాయి. ప్రధాన బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్లో పోర్టల్లోకి లాగిన్ అయ్యి ‘My Accounts & Profile’ సెక్షన్ కింద కనిపించే ‘Update KYC’పై క్లిక్ చేయాలి. ఎస్బీఐ అకౌంట్ను ఎంచుకొని ‘Next’పై క్లిక్ చేసి మీరు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి.
హెచ్డీఎఫ్సీ: హెచ్డీఎఫ్సీలో రీ- కేవైసీని వెబ్సైట్లోనే సులువుగా చేసుకోవచ్చు. పోర్టల్లోని వ్యక్తిగత విభాగంలో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. లేదంటే బ్యాంక్ నుంచి సంబంధిత ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి, పత్రాలు జోడించి దగ్గర్లోని బ్యాంకు శాఖకు పంపించాలి. లేదంటే నేరుగా బ్యాంకు శాఖలో అందించొచ్చు.
వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ.లక్షన్నర పైనే!
ఐసీఐసీఐ: ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ కేవైసీ అప్డేట్ చేయాల్సిఉంటే స్క్రీన్పైనే చూపిస్తుంది. అక్కడే కనిపించే ఆథరైజేషన్ బాక్స్పై టిక్ చేసి ‘Update Through Document Upload’ ఆప్షన్ను ఎంచుకోండి. వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసి పాన్ కార్డ్ను అప్లోడ్ చేయాలి. చిరునామా వివరాలను కూడా అక్కడే మార్చుకోవచ్చు.
కెనరా బ్యాంక్: లాగిన్ వివరాలతో కెనరా బ్యాంక్ వెబ్సైట్లో లాగిన్ అవగానే ‘services’ కింద కనిపించే ‘Re-KYC’పై క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేసేయొచ్చు.
యెస్ బ్యాంక్ అయితే.. బ్యాంక్ పోర్టల్లో లాగిన్ అవ్వగానే రీ- కేవైసీని పాప్-అప్ ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్లో కేవైసీ పూర్తి చేయొచ్చు. చిరునామాల్లో ఏవైనా మార్పులున్నా చేసుకోవచ్చు. పాస్పోర్ట్, పాన్ కార్డ్, భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ- ఆధార్ లెటర్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, NREGA జారీ చేసిన జాబ్కార్డ్ లను చిరునామా, ఐడీ ప్రూఫ్గా అంగీకరిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత