UPI: ఫ్రాన్స్లోనూ ‘యూపీఐ’ సేవలు షురూ.. తొలుత ఈఫిల్ టవర్ టికెట్ బుకింగ్కే!
‘యూపీఐ’ సేవలు ఫ్రాన్స్లోనూ ప్రారంభమయ్యాయి. తొలుత ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ‘ఈఫిల్ టవర్ (Eiffel Tower)’ వద్ద అందుబాటులోకి వచ్చాయి.
పారిస్: భారత్ అభివృద్ధి చేసిన నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’(UPI) సేవలు ఫ్రాన్స్లోనూ ప్రారంభమయ్యాయి. తొలుత ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ‘ఈఫిల్ టవర్ (Eiffel Tower)’ టికెట్ల బుకింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ‘యూపీఐ’ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆలోచనను అమలు చేసినట్లు ట్వీట్ చేసింది.
స్థానికంగా యూపీఐ సేవలను ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు గతేడాది ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేవలు భారత పర్యాటకులకు పెద్దఎత్తున ఉపయుక్తం కానున్నాయి. ఈఫిల్ టవర్ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకనుంచి ఆన్లైన్లో యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. క్రమంగా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
డిజిటల్ చెల్లింపులు..జర భద్రం
‘ఎన్పీసీఐ’కి చెందిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL).. ఫ్రాన్స్కు చెందిన లీరా సంస్థ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టింది. ‘ఎన్పీసీఐ’ 2016లో 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను భారత్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలకు విశేష ఆదరణ లభించింది. యూఏఈ, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.