డిజిటల్ చెల్లింపులు..జర భద్రం
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి.
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. సౌలభ్యం మాటున కొన్నిసార్లు సవాళ్లూ ఉంటాయి. చిన్న అజాగ్రత్తతో మన కష్టార్జితం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి, డిజిటల్ చెల్లింపుల్లో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.155 కోట్ల మేరకు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయి. క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉన్నవారూ కొన్నిసార్లు మోసాలకు బలి అవుతున్నారు. నగదు రహిత చెల్లింపులు అనివార్యం అవుతున్న ప్రస్తుత తరుణంలో.. మిమ్మల్ని మోసగాళ్లు ఎక్కడి నుంచి ఎలా లక్ష్యంగా చేసుకుంటారన్నది చెప్పలేం. ఈ రోజు పన్ను రిఫండ్ సందేశం కావచ్చు, రేపు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల పేరుతో ఉండొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మోసాల పద్ధతి మారుతూనే ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే.. మనమే బాధ్యతగా, మరింత అప్రమత్తంగా ఉండాలి.
కేవైసీ పేరుతో.. ప్రధానంగా ఇప్పుడు వస్తున్న మోసపూరిత ఫోన్లన్నీ బ్యాంకులో కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) నిబంధనలను పాటించాలని చెబుతున్నవే. సాధారణంగా ఏడాది కొత్తలో బ్యాంకు నిబంధనల్లో కొన్ని మార్పులు రావడం సహజం. ఇవే మోసగాళ్లకు వరంగా మారుతుంటాయి. కేవైసీ, రీ-కేవైసీ పేరుతో ఖాతాదారులను సంప్రదిస్తుంటారు. ఒకవేళ మీ బ్యాంకు నుంచి నిజంగానే కేవైసీ చేయాల్సిందిగా సందేశం వచ్చిందనుకోండి. చాలా సందర్భాల్లో బ్యాంకు శాఖను సంప్రదించాల్సిందిగా సూచిస్తుంది. లేకపోతే బ్యాంకు వెబ్సైటులోకి లాగిన్ కావాల్సిందిగా చెబుతుంది. ఇలా కాకుండా... సందేశంలో ఏదైనా లింకు వచ్చి, దాన్ని క్లిక్ చేయడం ద్వారా కేవైసీని పూర్తి చేయాల్సిందిగా చెబితే.. అది పూర్తిగా మోసపూరితమే. ఇలాంటి లింకుల్లో అడిగిన సమాచారాన్ని అందిస్తే, సైబర్ నేరగాళ్లు మీ ఖాతాపై పట్టు సాధించినట్లే.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సీవీవీ, ఓటీపీ, పాస్వర్డ్లాంటివి ఎవరికీ చెప్పొద్దు. చిన్న అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకును సంప్రదించి, ఫిర్యాదు చేయాలి.
గడువు తీరిపోతుందని..
డెబిట్, క్రెడిట్ కార్డులను వాడినప్పుడు వచ్చే రివార్డు పాయింట్ల గడువు కొన్నాళ్లకు తీరిపోతుంది. ఇప్పుడు సైబర్ మోసగాళ్లు వీటిపై పడ్డారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నట్లుగానే చెబుతూ.. రివార్డు పాయింట్లను వాడుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. వాటి గడువు పెంచాలంటే.. కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా అడుగుతారు. మీరు ఓటీపీలాంటి వివరాలు చెప్పగానే, మీ రివార్డు పాయింట్లతో వాళ్లు కొనుగోళ్లు చేస్తారు.
మీ క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. వీలును బట్టి, వాటిని వాడుకోండి. ఈ పాయింట్ల గడువును బ్యాంకులు సాధారణంగా పెంచవు. కాబట్టి, ఇలాంటి సందేశాలు వస్తే నమ్మొద్దు.
వస్తువులు కొన్నారంటూ.. మోసగాళ్లు కొన్నిసార్లు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటారు. రూ.10వేల వస్తువును రూ.1,000 మీరు కొనుగోలు చేశారని, దాన్ని మీకు చేర్చాలంటే.. డబ్బు చెల్లించాలని అంటుంటారు. క్యూఆర్ కోడ్ను పంపించి, డిజిటల్లో చెల్లించాలని అడుగుతారు. మనం ఆ వస్తువును నిజంగా కొన్నామా లేదా అని ఆలోచించుకునే లోపే డబ్బు చెల్లించాలని, లేకపోతే క్యూఆర్ కోడ్ సమయం అయిపోతుందని తొందర పెట్టేస్తారు. మరికొన్నిసార్లు మీకు డబ్బు వస్తుందని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సిందిగా చెబుతుంటారు.
- గర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు డబ్బు పంపాలి అంటేనే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, పిన్ను నమోదు చేయాల్సి ఉంటుంది. డబ్బు మీ ఖాతాలోకి రావాలంటే.. ఎలాంటి కోడ్నూ స్కాన్ చేయొద్దు.
- మీరు కొనుగోలు చేయని వస్తువు గురించి ఏ మాత్రం ఆలోచించొద్దు. వెంటనే ఆ ఫోన్ను కట్ చేయడం మేలు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- మన ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచే యూపీఐ యాప్లనే వాడాలి. ఇప్పుడు చాలా బ్యాంకులు తమ యాప్ల నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, చెల్లింపులు పూర్తి చేసే వీలును కల్పిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ వీటిని వాడటమే మేలు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ సులభమైన పాస్వర్డ్లను ఎంచుకోవద్దు. డిజిటల్ పేమెంట్ చెల్లింపులు చేసేటప్పుడు ఆరంకెల రహస్య సంఖ్యను వినియోగించాలి. పిన్ను కనీసం రెండు మూడు నెలలకోసారి మార్చడం ఉత్తమం.
- ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ఆర్థిక లావాదేవీలు చేసేందుకు బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్లను వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవద్దు.
- మీ మొబైల్ ఫోనులో ఉన్న చెల్లింపుల యాప్లను వినియోగించుకోవాలంటే రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. యాప్ను ప్రారంభించేందుకు, లావాదేవీలు చేసేందుకు వేర్వేరు పాస్వర్డ్లు ఉండాలి. బయోమెట్రిక్నూ ఉపయోగించుకోవాలి.
- చెల్లింపులు చేసేందుకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, లావాదేవీని పూర్తి చేసేటప్పుడు ఒకసారి సంబంధిత దుకాణదారు లేదా వ్యక్తిని వచ్చిన పేరు గురించి అడిగి తెలుసుకోవాలి. వారు ధ్రువీకరించిన తర్వాతే చెల్లింపులుపూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!