డిజిటల్ చెల్లింపులు..జర భద్రం
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి.
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. సౌలభ్యం మాటున కొన్నిసార్లు సవాళ్లూ ఉంటాయి. చిన్న అజాగ్రత్తతో మన కష్టార్జితం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి, డిజిటల్ చెల్లింపుల్లో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.155 కోట్ల మేరకు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయి. క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉన్నవారూ కొన్నిసార్లు మోసాలకు బలి అవుతున్నారు. నగదు రహిత చెల్లింపులు అనివార్యం అవుతున్న ప్రస్తుత తరుణంలో.. మిమ్మల్ని మోసగాళ్లు ఎక్కడి నుంచి ఎలా లక్ష్యంగా చేసుకుంటారన్నది చెప్పలేం. ఈ రోజు పన్ను రిఫండ్ సందేశం కావచ్చు, రేపు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల పేరుతో ఉండొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మోసాల పద్ధతి మారుతూనే ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే.. మనమే బాధ్యతగా, మరింత అప్రమత్తంగా ఉండాలి.
కేవైసీ పేరుతో.. ప్రధానంగా ఇప్పుడు వస్తున్న మోసపూరిత ఫోన్లన్నీ బ్యాంకులో కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) నిబంధనలను పాటించాలని చెబుతున్నవే. సాధారణంగా ఏడాది కొత్తలో బ్యాంకు నిబంధనల్లో కొన్ని మార్పులు రావడం సహజం. ఇవే మోసగాళ్లకు వరంగా మారుతుంటాయి. కేవైసీ, రీ-కేవైసీ పేరుతో ఖాతాదారులను సంప్రదిస్తుంటారు. ఒకవేళ మీ బ్యాంకు నుంచి నిజంగానే కేవైసీ చేయాల్సిందిగా సందేశం వచ్చిందనుకోండి. చాలా సందర్భాల్లో బ్యాంకు శాఖను సంప్రదించాల్సిందిగా సూచిస్తుంది. లేకపోతే బ్యాంకు వెబ్సైటులోకి లాగిన్ కావాల్సిందిగా చెబుతుంది. ఇలా కాకుండా... సందేశంలో ఏదైనా లింకు వచ్చి, దాన్ని క్లిక్ చేయడం ద్వారా కేవైసీని పూర్తి చేయాల్సిందిగా చెబితే.. అది పూర్తిగా మోసపూరితమే. ఇలాంటి లింకుల్లో అడిగిన సమాచారాన్ని అందిస్తే, సైబర్ నేరగాళ్లు మీ ఖాతాపై పట్టు సాధించినట్లే.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సీవీవీ, ఓటీపీ, పాస్వర్డ్లాంటివి ఎవరికీ చెప్పొద్దు. చిన్న అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకును సంప్రదించి, ఫిర్యాదు చేయాలి.
గడువు తీరిపోతుందని..
డెబిట్, క్రెడిట్ కార్డులను వాడినప్పుడు వచ్చే రివార్డు పాయింట్ల గడువు కొన్నాళ్లకు తీరిపోతుంది. ఇప్పుడు సైబర్ మోసగాళ్లు వీటిపై పడ్డారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నట్లుగానే చెబుతూ.. రివార్డు పాయింట్లను వాడుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. వాటి గడువు పెంచాలంటే.. కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా అడుగుతారు. మీరు ఓటీపీలాంటి వివరాలు చెప్పగానే, మీ రివార్డు పాయింట్లతో వాళ్లు కొనుగోళ్లు చేస్తారు.
మీ క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. వీలును బట్టి, వాటిని వాడుకోండి. ఈ పాయింట్ల గడువును బ్యాంకులు సాధారణంగా పెంచవు. కాబట్టి, ఇలాంటి సందేశాలు వస్తే నమ్మొద్దు.
వస్తువులు కొన్నారంటూ.. మోసగాళ్లు కొన్నిసార్లు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటారు. రూ.10వేల వస్తువును రూ.1,000 మీరు కొనుగోలు చేశారని, దాన్ని మీకు చేర్చాలంటే.. డబ్బు చెల్లించాలని అంటుంటారు. క్యూఆర్ కోడ్ను పంపించి, డిజిటల్లో చెల్లించాలని అడుగుతారు. మనం ఆ వస్తువును నిజంగా కొన్నామా లేదా అని ఆలోచించుకునే లోపే డబ్బు చెల్లించాలని, లేకపోతే క్యూఆర్ కోడ్ సమయం అయిపోతుందని తొందర పెట్టేస్తారు. మరికొన్నిసార్లు మీకు డబ్బు వస్తుందని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సిందిగా చెబుతుంటారు.
- గర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు డబ్బు పంపాలి అంటేనే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, పిన్ను నమోదు చేయాల్సి ఉంటుంది. డబ్బు మీ ఖాతాలోకి రావాలంటే.. ఎలాంటి కోడ్నూ స్కాన్ చేయొద్దు.
- మీరు కొనుగోలు చేయని వస్తువు గురించి ఏ మాత్రం ఆలోచించొద్దు. వెంటనే ఆ ఫోన్ను కట్ చేయడం మేలు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- మన ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచే యూపీఐ యాప్లనే వాడాలి. ఇప్పుడు చాలా బ్యాంకులు తమ యాప్ల నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, చెల్లింపులు పూర్తి చేసే వీలును కల్పిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ వీటిని వాడటమే మేలు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ సులభమైన పాస్వర్డ్లను ఎంచుకోవద్దు. డిజిటల్ పేమెంట్ చెల్లింపులు చేసేటప్పుడు ఆరంకెల రహస్య సంఖ్యను వినియోగించాలి. పిన్ను కనీసం రెండు మూడు నెలలకోసారి మార్చడం ఉత్తమం.
- ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ఆర్థిక లావాదేవీలు చేసేందుకు బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్లను వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవద్దు.
- మీ మొబైల్ ఫోనులో ఉన్న చెల్లింపుల యాప్లను వినియోగించుకోవాలంటే రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. యాప్ను ప్రారంభించేందుకు, లావాదేవీలు చేసేందుకు వేర్వేరు పాస్వర్డ్లు ఉండాలి. బయోమెట్రిక్నూ ఉపయోగించుకోవాలి.
- చెల్లింపులు చేసేందుకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, లావాదేవీని పూర్తి చేసేటప్పుడు ఒకసారి సంబంధిత దుకాణదారు లేదా వ్యక్తిని వచ్చిన పేరు గురించి అడిగి తెలుసుకోవాలి. వారు ధ్రువీకరించిన తర్వాతే చెల్లింపులుపూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్