UPI: వెయ్యికోట్ల UPI లావాదేవీలు.. వరుసగా మూడోసారి
UPI transactions: యూపీఐ లావాదేవీలు వరుసగా మూడోసారి వెయ్యి కోట్ల మార్కును సొంతం చేసుకున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు వరుసగా మూడోసారి వెయ్యి కోట్ల మార్కును అధిగమించాయి. అక్టోబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,141 కోట్లకు చేరింది. దీంతో వాటి విలువ రూ.17.16 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషేన్ ఆఫ్ ఇండియా (NPCI) తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
సెప్టెంబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,056 కోట్లు కాగా.. వాటి విలువ రూ.15.8 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో 1,024 కోట్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.15.18 కోట్లకు పెరిగింది. జులైలో 996 కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్స్లో గణనీయమైన వృద్ధి నమోదైందని ఎన్పీసీఐ పేర్కొంది. లావాదేవీల సంఖ్యలో 56శాతం, విలువ 42 శాతం పెరిగిందని తెలిపింది.
పని గంటలపై చర్చ.. కష్టపడేవాళ్లలో మనమూ ముందే
ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా చేసే చెల్లింపులు.. సెప్టెంబరులో 47.73 కోట్లు కాగా, అక్టోబరు నాటికి ఆ సంఖ్య 49.3 కోట్లకు చేరింది. దీంతో ఆ లావాదేవీల మొత్తం విలువ రూ.5.38 లక్షల కోట్లకు చేరిందని పేర్కొంది. ఐఎంపీఎస్ లావాదేవీల సంఖ్యలో 2 శాతం, విలువ 15 శాతం పెరిగిందని ఎన్పీసీఐ పేర్కొంది. వ్యాపారులు, కస్టమర్లలో డిజిటల్ అడాప్షన్ బాగా పెరిగింది. దానికి తోడు రివార్డులు వంటి ప్రోత్సాహకాలను అందించటంతో చాలా మంది డిజిటల్ లావాదేవీలపైనే మొగ్గుచూపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!