Apple: యాపిల్కు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం దావా
యాపిల్ సంస్థ స్మార్ట్ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది.
వాషింగ్టన్: స్మార్ట్ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం యాపిల్ (Apple) సంస్థ చట్ట విరుద్ధంగా వ్యహరించిందని అమెరికా (USA) న్యాయశాఖ ఆరోపించింది. ఈ మేరకు యాపిల్కు వ్యతిరేకంగా న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దాంతోపాటు యూఎస్లోని 16 రాష్ట్రాల అటార్ని జనరల్స్ కూడా సంస్థపై ఫిర్యాదు చేశారు. యాపిల్ ఐఫోన్తోపాటు ఐపాడ్, మ్యాక్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్ వంటి ఉత్పత్తుల్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ల వినియోగానికి నిర్దేశించిన నిబంధనలు యూజర్లపై భారం మోపే విధంగా ఉన్నాయని ఆరోపించారు. దీంతో యాపిల్ యూజర్లు తప్పనిసరిగా అధిక ధర చెల్లించి వాటిని కొనుగోలు చేయడంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా యాపిల్ అవతరించిందని తెలిపారు. అదే విధంగా యూజర్లు యాపిల్ ఉత్పత్తుల నుంచి ఇతర డివైజ్లకు మారే ప్రక్రియను కఠినతరంగా రూపొందించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు యాప్ స్టోర్లో కూడా పారదర్శకమైన నిబంధనలు పాటించలేదని వ్యాజ్యంలో ఆరోపించారు.
స్మార్ట్ డివైజ్తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్ అక్కర్లేదేమో!
యాపిల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. యూజర్లు తమ వ్యక్తిగత సమాచారానికి పటిష్ఠమైన భద్రత అందించే సంస్థలను ఎంచుకున్నారని తెలిపింది. తాజా ఫిర్యాదుతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లో యాపిల్ షేర్ల ధరలు తగ్గాయి. మరోవైపు కృత్రిమమేధ ఆధారిత ఉత్పత్తుల తయారీలో గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల కంటే యాపిల్ వెనుబడి ఉందనే భయాలు కంపెనీ షేర్ల విలువ తగ్గటానికి మరో కారణంగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం చట్ట విరుద్ధంగా వ్యవహరించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!