Ai pin: స్మార్ట్ డివైజ్తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్ అక్కర్లేదేమో!
Humane Ai Pin: హ్యూమన్ ఏఐ పిన్.. స్మార్ట్ఫోన్కు సవాలు విసురుతోంది. ఫోన్ చేయగలిగే అన్ని పనులూ చేసేస్తూ ఔరా అనిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కాల్స్ కోసం మన ఇళ్లల్లోకి వచ్చిన టెలిఫోన్.. ఇప్పుడు ప్రతి మనిషికీ తానే సర్వస్వం అనేలా మారిపోయింది. అది లేకుండా జీవితం గడవడం కష్టమనేలా అయిపోయింది. వెంట తీసుకెళ్లకపోతే ఏదో కోల్పోయామన్న భావన సైతం కొందరిలో వెంటాడుతుంటుంది. అలాంటి స్మార్ట్ఫోన్ స్థానాన్ని తాను భర్తీ చేస్తానంటోంది ఈ బుల్లి డివైజ్. దాని పేరు ఏఐ పిన్ (Ai Pin). అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమేన్ (Humane) దీన్ని రూపొందించింది. గతేడాది జులైలో ఈ డివైజ్ ను ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన MWC ఈవెంట్లోనూ దీన్ని ప్రదర్శించారు. త్వరలో దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఏఐ పిన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్లిప్స్ మోడల్ 699 డాలర్లు, లూనర్ 799 డాలర్లు, ఈక్వినాక్స్ మోడల్ 799 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ఆర్డర్ పెట్టిన వాళ్లకు ఏప్రిల్ 11 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఆర్డర్ చేస్తే మే నెలకు డెలివరీలు అందిస్తామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే దీన్ని డెలివరీ చేస్తోంది. ఇతర దేశాలకూ త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ భారత్లో ఎవరైనా కొనుగోలు చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలని కంపెనీ తన వెబ్సైట్లో సూచిస్తోంది. మార్కెట్లో అందుబాటులోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.
వాట్సప్ కొత్త ఫీచర్.. త్వరలో టెక్ట్స్ రూపంలోకి వాయిస్ మెసేజ్!
ఏఐ పిన్ (AI pin) అనేది ఎలాంటి స్క్రీనూ లేని ఓ వేరియబుల్ డివైజ్. ఆకారంలో చిన్నగా.. తక్కువ బరువుతో ఉంటుంది. మన దుస్తులకు ఎక్కడైనా అతికించొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. దీంట్లో కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరీ మీటర్ వంటి సెన్సర్లు ఉంటాయి. దీంట్లో ఎలాంటి స్క్రీనూ ఉండదు. ఒకవేళ ఏదైనా సమాచారం చూడాలంటే ఇందులోని బిల్ట్-ఇన్ ప్రొజెక్టర్ సాయంతో మీ అరచేయి లేదా ఏదైనా వస్తువును డిస్ప్లేగా వినియోగించుకోవచ్చు.
టాప్ ఫీచర్లు ఇవే..
- కాల్స్, మెసేజులు: ఈ బుల్లి డివైజ్ను మొబైల్లానే కాల్స్, మెసేజ్లకు వినియోగించుకోవచ్చు. వాయిస్ కమాండ్ ద్వారా కాల్ చేసి ఎవరితోనైనా మాట్లాడొచ్చు. సందేశాలు పంపించొచ్చు.
- అరచేతిలో సమాచారం: స్టాక్ మార్కెట్, క్రికెట్ స్కోర్.. ఇలా ఏదైనా సమాచారం కళ్లతో చూడాలనుకుంటే ఇందులోని ప్రొజెక్టర్ను వినియోగించుకోవచ్చు. అప్పటికప్పుడు మీ అరచేతినే డిస్ప్లేగా మార్చుకోవచ్చు.
- కెమెరా, వీడియో రికార్డింగ్: స్మార్ట్ఫోన్లానే ఏఐ పిన్ సాయంతో ఫొటోలు తీయొచ్చు. వీడియోనూ రికార్డ్ చేయొచ్చు. మీడియా ప్లేబ్యాక్ను సైతం కంట్రోల్ చేయొచ్చు.
- రిమైండర్ సెట్: అప్పటికప్పుడు ఏదైనా రాసుకోవడానికి మన స్మార్ట్ ఫంక్షన్లో నోట్స్ను వినియోగిస్తాం. ఆ ఫీచర్ ఇందులోనూ ఉంది. కావాలనుకుంటే రిమైండర్లు సైతం సెట్ చేసుకోవచ్చు.
- వెబ్ సెర్చ్: ఏదైనా సమాచారం కావాలంటే ఏఐ పిన్ ఇంటర్నెట్లోని సమాచారం సైతం అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అవసరమైతే విషయాన్ని క్లుప్తంగా ఇస్తుందని పేర్కొంది.
- లైవ్ ట్రాన్స్లేట్: ఏఐ పిన్ 50 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లైవ్లో ట్రాన్స్లేషన్ చేసేస్తుందట.
- ఇమేజ్ రికగ్నిషన్: ఏదైనా ఇమేజ్ను క్యాప్చర్ చేస్తే చాలు.. దానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ ఈ ఏఐ పిన్ తెలియజేస్తుంది. ఉదాహరణకు షూను ఫొటో తీస్తే అది ఏ కంపెనీ తయారుచేసిందో చెప్తుంది. ఒక కేక్ను ఫొటో తీస్తే దాన్లో ఎన్ని క్యాలరీలు దాగున్నాయో బయటపెడుతుంది. ఈ బుల్లి డివైజ్ను కావాలనుకుంటే కంప్యూటర్కు సైతం కనెక్ట్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం