Anant-radhika: ‘అందుకే జామ్నగర్ ఎంచుకున్నాం’: ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ స్పందన
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో జామ్నగర్ వేదికను ఎంచుకోవడంపై అనంత్(Anant Ambani) స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్(Anant Ambani-radhika merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ మూడురోజుల సంబరాలకు అంతర్జాతీయ అతిథులు హాజరవుతున్నారు. ఈ రేంజ్ ఈవెంట్స్కు గుజరాత్(Gujarat)లోని జామ్నగర్ (Jamnagar)ను ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. దీని గురించి జాతీయ మీడియాతో అనంత్ మాట్లాడారు.
‘‘నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడ వేడుక జరుగుతుండటం నా అదృష్టం. ఇది మా నానమ్మ జన్మభూమి. మా తాతయ్య, నాన్న కర్మభూమి. ఇది మీ తాతయ్య అత్తిల్లు అంటూ మా నాన్న తరచూ చెప్తుంటారు. భారత్లోనే వివాహాలు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇది నా ఇల్లు’’ అంటూ అనంత్ స్పందించారు.
అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్.. ఈ విశేషాలు తెలుసా..!
విదేశాల్లో వివాహ వేడుకలు (Destination Wedding) చేసుకుంటున్న భారతీయ యువ జంటలకు కొద్దినెలల క్రితం మోదీ సూచన చేసిన సంగతి తెలిసిందే. ‘‘మేకిన్ ఇండియా (Make In India) తరహాలో దేశంలో ‘వెడ్ ఇన్ ఇండియా’ (Wed in India) ప్రారంభం కావాలి. భారత్లో పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని విశ్వసిస్తారు. అలాంటప్పుడు దేవుడు కలిపిన జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని (పెళ్లి) విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభిస్తున్నాయి? యువ జంటలు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
రాధిక నా వెన్నంటి నిలిచింది: అనంత్
తాను ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడుతోన్న సమయంలో రాధికా మర్చంట్ ఎంతో అండగా నిలిచిందని అనంత్ వెల్లడించారు. ‘నా జీవితంలో ఆమె ఉండటం నా అదృష్టం. ఆమె నా కలలరాణి. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే నేను.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారింది. మా ఆలోచనలు కలిశాయి. ఆమె మూగజీవాల పట్ల దయతో ఉంటుంది. నేను ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో కొండంత అండగా నిలిచింది’ అని రాధికపై తన ప్రేమను వ్యక్తం చేశారు. అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారు. తన కుమారుడికి ఆస్థమా ఉండటంతో, బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రీవెడ్డింగ్కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరవిషయాలు తెలుస్తున్నాయి. అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నుంచి 21 మంది చెఫ్లను పిలిపించినట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
బ్యాంకింగ్ రంగంలో...
ఇండెక్స్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ కొత్త పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది. -
కార్డు బిల్లు సెటిల్ చేశారా?
క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. అనివార్య పరిస్థితుల్లో బిల్లును సెటిల్మెంట్ చేసుకోవాల్సి వస్తే? అది కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు. -
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
బైజూస్ సంస్థ పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కోర్సు ఫీజులను తగ్గించింది. సేల్స్ టీమ్కు ప్రోత్సాహకాలను పెంచింది. -
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్