Nikhil Kamath: సొంతిల్లా..? అద్దె ఇల్లా? నిఖిల్ కామత్ సమాధానమిదే..
Nikhil Kamath: జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఓ పాడ్కాస్ట్లో సొంతిళ్లు కొనకపోవడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
Nikhil Kamath | ఇంటర్నెట్డెస్క్: సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లో ఉండడం బెటరా? అనేది చాలామందికి ఉండే డౌట్. దీనిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. సొంతింట్లో అయితే హాయిగా ఉండొచ్చని కొందరు.. పెద్ద మొత్తం పెట్టి ఇల్లు కొనుగోలు చేసే బదులు అద్దె ఇంట్లోనే ఉండడం మేలని ఇంకొందరు చెబుతుంటారు. పెరిగిన వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు అధికంగా ఉండడం కూడా ఇంటి కొనుగోలుకు వెనకడుగు వేయడానికి మరో కారణం. ఈ విషయంపై స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Zerodha's CEO Nikhil Kamath) ఓ పాడ్కాస్ట్లో మాట్లాడారు.
‘ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నా. భవిష్యత్లోనూ అలానే ఉండాలని అనుకుంటున్నా. నాకు ఉన్నది ఒకటే ఇల్లు. అందులో అమ్మానాన్న ఉంటున్నారు. భావోద్వేగపరంగా ఆ ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది. నా విషయంలో మాత్రం సొంతింటిపై ఉన్న అభిప్రాయం మారదు. ఇల్లు కొనేందుకయ్యే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే.. 10 లేదా 12శాతం రాబడి వస్తుంది. అందులో మూడు, నాలుగో వంతు మొత్తంతో నాలుగు ఇళ్లకు అద్దె కట్టొచ్చు. ఒకవేళ ఇంటిని కొని అద్దెకు ఇచ్చినా దానిద్వారా వచ్చే రాబడి చాలా తక్కువ. ఏవిధంగా చూసినా ఇల్లు కొనడంలో ఎలాంటి అర్థం లేదు’ అని కామత్ పేర్కొన్నారు.
పేటీఎం యూపీఐ ఐడీ సంగతి చూడండి.. NPCIని కోరిన ఆర్బీఐ
ముంబయిలో ఇంటిని కొనుగోలు చేయడం కంటే అద్దె ఇంట్లోనే ఉండడం మేలని గతంలో మాధురిదీక్షిత్, కృతిసనన్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు చెప్పుకొచ్చారు. కామత్ అభిప్రాయంతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. ‘మనకు వచ్చే ఆదాయంలో 20 శాతం లోన్ చెల్లించి ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆలోచన’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. అద్దె ఇంట్లో నచ్చినట్లుగా ఉండడం సాధ్యపడదని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!