‘క్విక్’ ఫోకస్.. బ్లింకిట్లో జొమాటో రూ.300 కోట్ల పెట్టుబడి
Zomato: క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్లో రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జొమాటో సిద్ధమైంది.
Zomato | ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (zomato).. తన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit)లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే స్విగ్గీ, జెప్టో నుంచి పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. అందులోభాగంగా రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుందని కంపెనీ తన ఫైలింగ్లో పేర్కొంది.
2022 ఆగస్టులో జొమాటో రూ.4,477 కోట్లకు బ్లింకిట్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఇప్పటివరకు రూ.2,300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. బ్లింకిట్తో పాటు తన అనుబంధ సంస్థ జొమాటో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.100 కోట్లు పెట్టింది. ఈ సంస్థ లైవ్ ఈవెంట్లు, టికెటింగ్లను నిర్వహిస్తుంది. స్విగ్గీ తీసుకొచ్చిన ఇన్స్టామార్ట్, జెప్టో నుంచి బ్లింకిట్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో మరోసారి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం గమనార్హం.
ఇక ఐఫోన్స్లో చాట్జీపీటీ.. iOS 18లో పలు కొత్త ఫీచర్లు
ఓవైపు స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.10,414 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. మరోవైపు జెప్టో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,500 కోట్లు) సమీకరించడానికి చర్చలు జరుపుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో బ్లింకిట్ ఆదాయం రూ.1,064 కోట్లుగా ఉంది. 2024లో ఆ ఆదాయం రూ.2,302 కోట్లకు చేరింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు డెలివరీ చేస్తున్న సంస్థ.. త్వరలో దుస్తులు, గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్ వస్తువులు, గృహోపకరణాలను చేర్చాలని చూస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ విభాగాన్ని బ్లింకిట్ అధిగమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..