TMC: ఎంపీ వాహనం ఢీకొని.. నాలుగేళ్ల చిన్నారి మృతి

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కారు ఢీకొని ఓ నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. తల్లితో కలిసి రోడ్డు దాటుతోన్న సమయంలో ఎంపీ వాహనం తగలడంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

Published : 17 Nov 2022 00:03 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అబూ తాహెర్‌ ఖాన్‌ వెళ్తోన్న కారు  నాలుగేళ్ల చిన్నారిని ఢీకొట్టింది.  తీవ్రంగా గాయపడిన  బాలుడిని .. ఎంపీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు బలమైన గాయం కావడంతో  చికిత్స పొందుతూ  బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు.. మీడియా, వైద్యు  ముందు తీవ్రంగా విలపించారు.

‘మా వాహనం వెళ్తున్న సమయంలో ఓ బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఐదు, ఆరేళ్ల వయసు ఉంటుంది. ఆ బాలుడిని మేమే ఆస్పత్రికి తరలించాం. నా కళ్లముందే ఇదంతా జరిగింది. బాలుడి మెదడుకు తీవ్ర గాయాలై ఉంటాయి’ అని ఆసుపత్రి బయట ఉన్న మీడియాకు ఎంపీ తాహెర్‌ ఖాన్‌ వెల్లడించారు. ఈ ఘటనను సుమోటో కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఎంపీ కారును సీజ్‌ చేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తన తల్లితో కలిసి చిన్నారి రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని