Crime News: కాకతీయ కాలువలో పడి హెడ్‌కానిస్టేబుల్ గల్లంతు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం అల్గునూర్‌లోని కాకతీయ కాలువలో పడి గల్లంతయ్యాడు.

Published : 26 Aug 2023 15:29 IST

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం అల్గునూర్‌లోని కాకతీయ కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది గమనించిన మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మల్లయ్య ప్రస్తుతం కరీంనగర్ భగత్ నగర్‌లో నివాసం ఉంటూ.. పెద్దపల్లి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని