ఇల్లరికం వస్తానన్నాడు.. ఇల్లొదిలి వెళ్లాడు!
అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి తరఫు వారు ఆ విషయంపైనా చర్చించారు. యువకుడు అందుకూ అంగీకరించడంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా రేపు పెళ్లనగా, ఒకరోజు ముందు అతను అదృశ్యం కావడంతో అందరూ అవాక్కయ్యారు.
పెళ్లికి ఒక్కరోజు ముందు.. యువకుడు పరార్
ఆగిన వివాహం, పోలీసులకు ఫిర్యాదు
ముథోల్, న్యూస్టుడే: అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి తరఫు వారు ఆ విషయంపైనా చర్చించారు. యువకుడు అందుకూ అంగీకరించడంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా రేపు పెళ్లనగా, ఒకరోజు ముందు అతను అదృశ్యం కావడంతో అందరూ అవాక్కయ్యారు. నిర్మల్ జిల్లా ముథోల్లో బుధవారం జరిగిన ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో, ముథోల్ గ్రామానికి చెందిన సంతోష్కు నెల రోజుల కిందట వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలోనే ఇల్లరికం వెళ్లేందుకూ అతను అంగీకారం తెలిపాడు. బుధవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం సాయంత్రమే యువతి సహా ఆమె కుటుంబ సభ్యులు ముథోల్కు చేరుకున్నారు. ఆ సమయానికి యువకుడు అదృశ్యం కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికారు. బుధవారం సాయంత్రం వరకు అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఉద్దేశ పూర్వకంగానే అతను పరారయ్యాడనే నిర్ధారణకు వచ్చిన యువతి తరఫు వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనికి వివాహం ఇష్టం లేదా? ఇల్లరికం వెళ్లడం ఇష్టం లేక పరారయ్యాడా? అనేది తెలియాల్సి ఉందని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు తరలే ఓటర్లకు తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?