Toopran: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. యువకుడికి చిత్రహింసలు
స్నేహితుడి శరీరంపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో సోమవారం వెలుగు చూసింది.
తూప్రాన్, న్యూస్టుడే: స్నేహితుడి శరీరంపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన నారాయణ అలియాస్ కిట్టు తూప్రాన్కు చెందిన సాయి, జితేందర్, మరోవ్యక్తి స్నేహితులు. ఆదివారం రాత్రి ముగ్గురూ కలిసి కిట్టు(25)ను తూప్రాన్కు పిలిచారు. వీరంతా సాయి ఇంటికి వెళ్లి మద్యం తాగారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురూ కిట్టును విద్యుత్తు తీగలతో కట్టేశారు. శరీరంతోపాటు మర్మాంగాలు, నాలుకపై వాతలు పెట్టారు. బాధితుడు వారినుంచి తప్పించుకుని ఒంటిపై దుస్తులు లేకుండానే 44వ నంబరు జాతీయ రహదారి మీదుగా దాబాల వద్దకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక మహిళతో కిట్టు వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె పుట్టింటికి వెళ్లేందుకు కారణమయ్యాడన్న కక్షతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
Prostitution racket: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు సెక్స్ రాకెట్ను ఛేదించారు. మైనర్ బాలికలను రక్షించారు. ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్లకు మ్యూల్ ఖాతాలు.. బెంగళూరులో చిక్కిన ఖమ్మం వాసి
నిర్మల్ జిల్లా భైంసా వాసులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి.. వాటిని ఆన్లైన్ బెట్టింగ్లకు వినియోగించిన కేసులో కీలక నిందితుడు చిక్కాడు. -
అర్ధరాత్రి ఆరుగురు సజీవ దహనం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి
గుజరాత్లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. -
సచిన్ ఇంటి సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే గార్డు కాప్డే (39) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓ అధికారి వెల్లడించారు. -
చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి
వేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
కామారెడ్డి డీఎంహెచ్వో లైంగిక వేధింపులు.. ఏడు కేసుల నమోదు
కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డి.లక్ష్మణ్సింగ్పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్రావు బుధవారం తెలిపారు.