Toopran: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. యువకుడికి చిత్రహింసలు

స్నేహితుడి శరీరంపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో సోమవారం వెలుగు చూసింది.

Updated : 01 Aug 2023 10:28 IST

తూప్రాన్‌, న్యూస్‌టుడే: స్నేహితుడి శరీరంపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేటకు చెందిన నారాయణ అలియాస్‌ కిట్టు తూప్రాన్‌కు చెందిన సాయి, జితేందర్‌, మరోవ్యక్తి స్నేహితులు. ఆదివారం రాత్రి ముగ్గురూ కలిసి కిట్టు(25)ను తూప్రాన్‌కు పిలిచారు. వీరంతా సాయి ఇంటికి వెళ్లి మద్యం తాగారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురూ కిట్టును విద్యుత్తు తీగలతో కట్టేశారు. శరీరంతోపాటు మర్మాంగాలు, నాలుకపై వాతలు పెట్టారు. బాధితుడు వారినుంచి తప్పించుకుని ఒంటిపై దుస్తులు లేకుండానే 44వ నంబరు జాతీయ రహదారి మీదుగా దాబాల వద్దకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని తూప్రాన్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక మహిళతో కిట్టు వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె పుట్టింటికి వెళ్లేందుకు కారణమయ్యాడన్న కక్షతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని