ఉద్యోగం పోలీసుశాఖలో.. ఊతం ఉగ్రవాదులకు!
జమ్మూకశ్మీర్ పోలీసుశాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముష్తాఖ్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్లో డీఎస్పీ అరెస్ట్
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్ పోలీసుశాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముష్తాఖ్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గుట్టు బయటపడ్డాక.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని సైతం ఇందులో ఇరికించాలని ఆదిల్ ప్రయత్నించాడు. దీంతో అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు శ్రీనగర్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ఆరు రోజుల కస్టడీకి తీసుకొన్నారు. గత జులై నెలలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి ఫోను విశ్లేషించి, విచారించగా.. డీఎస్పీ ఆదిల్తో తాను నిరంతరం టచ్లో ఉన్నట్లు వెల్లడించాడు. చట్టం కన్నుగప్పడంలో డీఎస్పీ తనకు సాయం చేసినట్లు తెలిపాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆదిల్ ఆ ఉగ్రవాదితో మాట్లాడటం, సందేశాలు పంపడం వంటివి చేసినట్లు సీనియర్ అధికారులు గుర్తించారు. ‘‘డీఎస్పీకి, ఉగ్రవాదికి మధ్య 40 ఫోన్కాల్ సంభాషణలు జరిగాయి. అరెస్టును తప్పించుకోవడం, న్యాయసాయం పొందడంపై డీఎస్పీ అతడికి సలహాలు ఇస్తున్నాడు’’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారి వెల్లడించారు. లష్కరే తొయిబాకు నిధులు సేకరించే ముజ్మిల్ జహూర్తో డీఎస్పీ ఆదిల్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిని అరెస్టు నుంచి తప్పించిన ఆదిల్.. ఉగ్రవాదుల వద్ద రూ.5 లక్షలు తీసుకొన్నట్లు తేలింది. ట్విటర్లో చురుగ్గా ఉండే ఆదిల్కు ఏకంగా 44 వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. -
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
Nandyala: భార్యతో గొడవ.. అత్త, బావమరిదిపై కత్తితో దాడి
నంద్యాల జిల్లా పాణ్యంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అత్త, బావమరిదిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న గణేశ్ డబ్బుల కోసం తరచూ భార్య తులసితో గొడవపడుతూ ఉండేవాడు. -
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
చండీగఢ్లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. -
ఎన్నికల వేళ మందుపాతర కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం ఎన్నికల వేళ మావోయిస్టుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. -
పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడని ఇనుప రాడ్లతో దాడి
రాష్ట్రంలో వైకాపా నేతల అకృత్యాలకు అడ్డు లేకుండా ఉంది. తన పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడన్న కక్షతో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిపై ఇనుపరాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు. -
బ్యాంకులో 7 కేజీల ఆభరణాల గల్లంతు
శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్ బ్యాంక్ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి. -
ఈస్ట్కోస్ట్ రైలులో పొగలు
వేగంగా వెళుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన యాదగిరిగట్ట మండలం వంగపల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. -
కల్తీ ఔషధం తాగి గుజరాత్లో అయిదుగురి మృతి
గుజరాత్లోని ఖేడా జిల్లాలో గురువారం దారుణం జరిగింది. మిథైల్ ఆల్కహాల్ కలిగి ఉన్న ఆయుర్వేద ఔషధాన్ని తాగి అయిదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు