అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది.
పరిగి గ్రామీణ, న్యూస్టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. రాపోల్ గ్రామానికి చెందిన నల్లోల్ల నర్సింహులు(32) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల పొలాన్ని చదును చేయించి బోరు తవ్వించారు. అందులోని అరెకరంలో వరి, ఎకరంన్నరలో పత్తి పంటలు సాగు చేశారు. అందుకోసం రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. ఇటీవలి వర్షాలకు పత్తి మొక్కలు ఎరుపుగా మారాయి. దీంతో పంట చేతికి రాదని, అప్పులు ఎలా తీర్చాలని కొంతకాలంగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్య పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి ఆయన్ను చికిత్స కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారు. నర్సింహులుకు భార్య కొమ్రమ్మ, కుమార్తె వర్షిత, కుమారుడు నాని ఉన్నారు. రైతు ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్