పుట్టిన రోజు నాడే చివరిరోజైంది
అప్పటిదాకా ఎంతో సంతోషంగా పుట్టినరోజు నిర్వహించుకున్న ఆ చిన్నారి అనుకోని ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
బండ విరిగిపడి ప్రైవేటు పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి మృతి
గుంతకల్లు పట్టణం, న్యూస్టుడే: అప్పటిదాకా ఎంతో సంతోషంగా పుట్టినరోజు నిర్వహించుకున్న ఆ చిన్నారి అనుకోని ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, బాలిక తండ్రి చెప్పిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అంకాలమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న రంగయ్య, శిరీష దంపతులకు కీర్తన, అభిరామ్, కేశవ్ సంతానం. పెద్ద కుమార్తె కీర్తన(4) స్థానికంగా శ్రీ విద్య ఇంగ్లిష్ మీడియం స్కూలులో ఎల్కేజీ చదువుతోంది. ఆ పాఠశాలను చుట్టూ బండలతో కట్టిన రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆ చిన్నారి పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రులు కొత్త దుస్తులు తొడిగి, ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేయించారు. అనంతరం పాఠశాలలో అందరికీ చాకెట్లు పంచింది. మధ్యాహ్నం ఇంటికి రాగా.. తల్లి దుస్తులు మార్చి కుమార్తెను తిరిగి పాఠశాలలో వదిలిపెట్టింది. అనంతరం 3.30 గంటల సమయంలో తరగతి గదిలో ఆ పాప నిద్రపోగా తలపై బండ విరిగిపడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న ఉపాధ్యాయులు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పాపకు ప్రమాదం జరిగినా ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వలేదని, పిల్లలు వచ్చి చెప్పేంత వరకు విషయం తెలీదని తండ్రి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పట్టణ సీఐ గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
ఒడిశా తీరంలో ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
Enforcement Directorate: రూ. కోటి లంచం.. ఈడీ అధికారి అరెస్టు!
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. -
Robbery: తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ
ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో దుండగులు పట్టపగలే రెచ్చిపోయారు. ఉద్యోగుల్ని బెదిరించి బ్యాంకు ఖజానా నుంచి రూ.18కోట్లకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. -
Hanamkonda: సీఐ కుమారుడి నిర్లక్ష్యం.. కారు ఢీకొని మహిళ మృతి
ఓటు వేసి వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. -
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. -
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
Nandyala: భార్యతో గొడవ.. అత్త, బావమరిదిపై కత్తితో దాడి
నంద్యాల జిల్లా పాణ్యంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అత్త, బావమరిదిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న గణేశ్ డబ్బుల కోసం తరచూ భార్య తులసితో గొడవపడుతూ ఉండేవాడు. -
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
చండీగఢ్లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. -
ఎన్నికల వేళ మందుపాతర కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం ఎన్నికల వేళ మావోయిస్టుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. -
పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడని ఇనుప రాడ్లతో దాడి
రాష్ట్రంలో వైకాపా నేతల అకృత్యాలకు అడ్డు లేకుండా ఉంది. తన పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడన్న కక్షతో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిపై ఇనుపరాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు. -
బ్యాంకులో 7 కేజీల ఆభరణాల గల్లంతు
శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్ బ్యాంక్ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి. -
ఈస్ట్కోస్ట్ రైలులో పొగలు
వేగంగా వెళుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన యాదగిరిగట్ట మండలం వంగపల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. -
కల్తీ ఔషధం తాగి గుజరాత్లో అయిదుగురి మృతి
గుజరాత్లోని ఖేడా జిల్లాలో గురువారం దారుణం జరిగింది. మిథైల్ ఆల్కహాల్ కలిగి ఉన్న ఆయుర్వేద ఔషధాన్ని తాగి అయిదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/12/2023)
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
-
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
-
Chandrababu: సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం
-
Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
-
ఆ మాజీ నేవీ అధికారుల్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు!