దళిత యువకుడి ప్రాణం తీసిన ఫ్లెక్సీ వివాదం: పోలీసుల తీరుపై ఆరోపణలు.. ఎస్ఐ సస్పెన్షన్
వైకాపా ఫ్లెక్సీ చిరిగిన వివాదం ఓ దళిత యువకుడి ఆత్మహత్యకు దారితీసిన ఘటన హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది.
మృతదేహాన్ని తీసుకొస్తుండగా రాళ్ల దాడి.. అదనపు ఎస్పీకి గాయాలు
హోం మంత్రి ఇలాకాలో ఘటన
కొవ్వూరు పట్టణం, చాగల్లు, న్యూస్టుడే: వైకాపా ఫ్లెక్సీ చిరిగిన వివాదం ఓ దళిత యువకుడి ఆత్మహత్యకు దారితీసిన ఘటన హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ నెల 6న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హోం మంత్రి వస్తున్నారని నాయకులు నాగరాజు, సతీష్ తదితరులు ఫ్లెక్సీలు కట్టారు. ఓ ఫ్లెక్సీలో నాగరాజు, సతీష్ ముఖాలున్న భాగాన్ని ఎవరో కత్తిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న కొవ్వూరు పట్టణ ఎస్ఐ భూషణం దొమ్మేరు వెళ్లారు. బొంతా మహేంద్ర (23) అనే యువకుడి గురించి జడ్పీటీసీ సభ్యురాలు బొంతా వెంకటలక్ష్మి భర్త పోశిబాబుకు ఫోన్ చేసి ఆరా తీశారు.
పోశిబాబు అన్న కుమారుడైన మహేంద్ర వైకాపాలోనే ఉన్నారు. పోశిబాబు సూచనతో మహేంద్ర కొవ్వూరు స్టేషన్కు వెళ్లారు. ఫ్లెక్సీ విషయమై ఎస్ఐ అతడిని ప్రశ్నించారు. కుటుంబసభ్యులు, మద్దతుదారులు స్టేషనుకు రావడంతో సాయంత్రం విడిచిపెట్టారు. ఇంటికి వెళ్లిన మహేంద్ర మనస్తాపంతో మంగళవారం తెల్లవారుజామున పురుగులమందు తాగారు. విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతిచెందారు. మృతదేహాన్ని దొమ్మేరు తీసుకొచ్చే క్రమంలో గ్రామంలోని దళిత యువత ఆగ్రహిస్తూ పెద్దఎత్తున ఉద్యమించింది. పోలీసులు వారిని సముదాయించారు. రాత్రి 10.30కు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులపైకి సీసాలు, రాళ్లను విసిరారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ (క్రైమ్) గోగుల వెంకటేశ్వరరావు తలకు గాయమైంది. ఆయన్ను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు లాఠీలు ఝుళిపించి గుంపును చెదరగొట్టారు.
మహేంద్ర పరిస్థితిని జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి... హోం మంత్రికి చెప్పినా స్పందించలేదని, అందుకు నిరసనగా అతని మృతదేహాన్ని హోం మంత్రి పాల్గొంటున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వద్దకు తీసుకెళ్లాలని బాధిత కుటుంబీకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ, మరో ఇద్దరు నాయకులపై మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్ఐ భూషణంను ఏలూరు డీఐజీ అశోక్కుమార్ సస్పెండ్ చేసినట్లు ఎస్పీ పి.జగదీష్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది. -
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. -
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!