ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
ప్రభుత్వ అధికారినంటూ ఫోన్లు చేసి డబ్బు వసూలు
అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని అరెస్టు చేసిన గద్వాల పోలీసులు
గద్వాల అర్బన్, న్యూస్టుడే: మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. గద్వాల సీఐ భీంకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైయస్ఆర్ జిల్లా బి.కోడూరు మండలం రామచంద్రాపురానికి చెందిన బిల్ల నాగేశ్వరరావు 2019లో రెండు నెలలపాటు అక్కడి బద్వేల్ పురపాలక కార్యాలయంలో తాత్కాలిక క్లర్క్గా విధులు నిర్వహించాడు. వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సుల అనుమతి, వాటి రెన్యువల్ గురించి అవగాహన పెంచుకున్నాడు. దీని ఆధారంగా అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. మున్సిపల్ కమిషనర్ను అంటూ వ్యాపారులకు ఫోన్లు చేస్తూ దందాకు తెర తీశాడు. నెల రోజుల క్రితం గద్వాల పరిసర ప్రాంతాల్లో బత్తాయి తోటల్లో కూలీ నిమిత్తం వచ్చాడు. అక్కడే తిష్ఠ వేసిన నాగేశ్వరరావు స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, క్లినిక్లను పరిశీలించి వాటి బోర్డులపై ఉన్న ఫోన్ నంబర్లు సేకరించాడు. అనంతరం ఓ ఫుడ్ కోర్టుకు ఫోన్ చేసి.. త్వరగా మీ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని, డబ్బులు తనకు ఫోన్ పే చేస్తే తమ సిబ్బంది పని పూర్తి చేసి ధ్రువపత్రాలు తెచ్చిస్తారని చెప్పడంతో నిర్వాహకులు రూ.3,420 పంపారు. మరుసటి రోజు మళ్లీ మాయమాటలు చెప్పి మరో రూ.3,600 తీసుకున్నాడు.తమ సిబ్బంది వచ్చి ధ్రువపత్రాలు ఇస్తారని, వారికి రూ.500 చెల్లించాలని సందేశం పంపడంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు ఫోన్ చేసి నాగేశ్వరరావును నిలదీయడంతో వారి నంబరును బ్లాక్ చేశాడు. దీంతో నిర్వాహకులు అదే రోజు సైబర్ క్రైం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గద్వాల పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. సీఐ భీంకుమార్ విచారణ ప్రారంభించి సాంకేతిక ఆధారంగా నిందితుడు గద్వాల కొత్తబస్టాండు పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించి శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో గద్వాల, హైదరాబాద్, సైబరాబాద్, నాగర్కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్నగర్, ఏపీలోని ప్రకాశం, అనంతపురం, వైయస్ఆర్, బద్వేల్ తదితర ఠాణాల పరిధిలో ఇదే తరహా సైబర్ నేరాలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
తాము ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా వచ్చిన వానరాన్ని తప్పించబోయి ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. -
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. -
కుటుంబాన్ని పగబట్టిన విధి!
ఎన్నికల విధులకు కుమారుడితో కలిసి వెళ్లిన మహిళను రైలు ఢీకొట్టింది. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పురపాలిక పరిధి శేర్పల్లి(బి) వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం(42) దుర్మరణం పాలయ్యారు. -
బెట్టింగ్కు బానిసైన కుమారుడి హత్య..
క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడిన యువకుడు రూ.కోట్లలో అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడనే ఆక్రోశంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. -
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలి.. 10 మందికి గాయాలు
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలుడు హైదరాబాద్లోని పాతబస్తీ భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధి తలాబ్కట్టలో విధ్వంసం సృష్టించింది. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి హఠాన్మరణం
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్బూత్కు వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి(పీవో) గుండెపోటుతో మృతి చెందారు. -
తెదేపా నేత అనుమానాస్పద మృతి
పల్నాడు జిల్లా గురజాల మండలం బూదవాడ గ్రామానికి చెందిన తెదేపా నేత దాసరి బ్రహ్మయ్య (33) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. -
ఏనుగు దాడిలో వ్యక్తి మృతి
జిల్లాలో ఏనుగుల సంచారం ఇటీవల పెరిగిపోయింది. -
తెదేపాలో చేరారని న్యాయవాది కారు దహనం
తెదేపాలో చేరారని న్యాయవాది కారుని వైకాపా నాయకులు దహనం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
కారులో కోటిన్నర వదిలేసి డ్రైవర్ పరారీ
ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న విశాఖపట్నం పోలీసులు ఓ కారులోని రూ.1.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు