వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం

వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 29 Apr 2024 06:03 IST

ఒంగోలు, న్యూస్‌టుడే: వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ రవికుమార్‌ కథనం ప్రకారం.. కొద్దిరోజుల కిందట నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో గోవా మద్యం సీసాలు దొరికాయి. ఈ క్రమంలోనే చీమకుర్తి ప్రాంతంలో ఓ ఖాళీ గోవా మద్యం సీసా ఎక్సైజ్‌ పోలీసులకు లభించింది. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు యర్రగుడిపాడులోని ఓ పశువుల పాకలో మద్యం సీసాలు దాచినట్లు సమాచారం అందింది. ఈఎస్‌ పర్యవేక్షణలో చీమకుర్తి సెబ్‌ సీఐ మరియబాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు గంగిరేకుల వెంకట్రావుకి చెందిన పశువుల పాకలో దాచి ఉంచిన 1,001 గోవా మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని చీమకుర్తి ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసి వెంకట్రావును అరెస్టు చేసినట్లు సూపరిండెంట్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని