8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది.
280 లావాదేవీల ద్వారా ఓ వ్యాపారికి బురిడీ
విదేశీ విరాళాలు తెప్పిస్తామంటూ ఘరానా మోసం
ఈనాడు, హైదరాబాద్: తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. ఓ వ్యాపారిని 8 నెలలపాటు మోసగించడం ద్వారా ఆ సొమ్ము కొట్టేశారు. వివరాలివీ.. హైదరాబాద్ కొండాపూర్లో నివసించే వ్యాపారి(42) నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో హార్డ్వేర్ స్టోర్ నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఘంటా యాదయ్య అలియాస్ గిరితో 2019లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి స్థిరాస్తి వ్యాపారం నిర్వహించారు. 2023 ఆగస్టులో గిరి కొత్త ప్రతిపాదనను వ్యాపారి ముందుంచాడు. నల్గొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామానికి చెందిన స్వామీజీ కేతావత్ దేవ్సింగ్ నాయక్ రాథోడ్ తనకు తెలుసని.. 40 దేశాల్లో స్థిరపడిన అతడి శిష్యులు రూ.కోట్లలో విరాళాలు పంపిస్తుంటారని చెప్పాడు. ముందస్తుగా చెల్లించాల్సిన పన్నులను కడితే 30శాతం వాటా దక్కుతుందని సూచించాడు. రూ.19.5కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆర్బీఐ పత్రాలు అంటూ కొన్ని నకిలీ కాగితాలు చూపించి నమ్మించాడు.
గత ఏడాది ఒకసారి యూకే నుంచి విదేశీ ప్రతినిధి ఆగస్టీన్ హైదరాబాద్ రాడిసన్బ్లూ హోటల్కు వస్తున్నారని వెళ్లి కలుద్దామని గిరి చెప్పాడు. తర్వాత.. ఆగస్టీన్ను హైదరాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ వర్గాలు ఆపినట్లు తెలిపాడు. రాథోడ్కు ఇచ్చేందుకు తెస్తున్న రూ.15కోట్ల విలువైన అమెరికా డాలర్లను కస్టమ్స్ అధికారులు అతడి బ్యాగ్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారని నమ్మించాడు. గత ఏడాది సెప్టెంబరు 16న ఆగస్టీన్ వ్యాపారికి ఫోన్ చేశాడు. లాయర్ అంటూ మోర్గాన్ను పరిచయం చేశాడు. డాలర్లను విడిపించేందుకు సొమ్ము బదిలీ చేయాలని అతడు బ్యాంక్ ఖాతా నంబర్లను ఇచ్చాడు. ఆగస్టీన్.. తన మేనేజర్ అంటూ జార్జిని వ్యాపారికి పరిచయం చేశాడు. తర్వాత నుంచి జార్జి ఫోన్లు చేస్తూ సొమ్ము ఎంత తొందరగా చెల్లిస్తే అంత త్వరగా డాలర్లను విడుదల చేసుకోవచ్చని వ్యాపారిని నమ్మించాడు. గత నెలలో రాథోడ్ ఫోన్ చేసి దిల్లీకి రావాలని వ్యాపారికి సూచించాడు. ఆ సమయంలో అతడి పీఏగా పరిచయం అయిన కిరణ్.. పలుమార్లు వ్యాపారితో మాట్లాడాడు. మరోవైపు స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు మేనేజర్నంటూ మోర్ అనే వ్యక్తి వ్యాపారితో మాట్లాడాడు. రాథోడ్కు రూ.2కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఐదు విడతలుగా రూ.3-4లక్షల చొప్పున పన్నుల కింద జమ చేయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా విరాళాలు అందకపోవడంతో గిరిని వెంటపెట్టుకొని వ్యాపారి ఈ నెల 13న దిల్లీ వెళ్లి రాథోడ్ను కలిశారు. విరాళాల గురించి ప్రశ్నించగా మరో రూ.7 లక్షల పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పాడు. ‘నేను త్వరలో నేషనల్ జ్యూట్బోర్డు ఛైర్మన్గా నామినేట్ అవుతున్నా. సునీల్కుమార్ అనే వ్యక్తి ఇందుకు సహకరిస్తున్నారు. నేను పదవి పొందిన తర్వాత విరాళాల విడుదల సులభమవుతుంది’ అని చెప్పాడు. సునీల్కుమార్ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయాలని వ్యాపారికి సూచించాడు. ఈమేరకు వ్యాపారి 14 విడతల్లో రూ.40లక్షలను సునీల్కుమార్కు పంపారు. అలా గత ఏడాది ఆగస్టు 16 నుంచి ఈనెల 3 వరకు 280 లావాదేవీల ద్వారా మొత్తం రూ.7,18,11,016 గిరి, రాథోడ్ ముఠా చెప్పిన వారికి వ్యాపారి బదిలీ చేశారు. అయినా ముఠా నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
తాము ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా వచ్చిన వానరాన్ని తప్పించబోయి ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. -
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. -
కుటుంబాన్ని పగబట్టిన విధి!
ఎన్నికల విధులకు కుమారుడితో కలిసి వెళ్లిన మహిళను రైలు ఢీకొట్టింది. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పురపాలిక పరిధి శేర్పల్లి(బి) వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం(42) దుర్మరణం పాలయ్యారు. -
బెట్టింగ్కు బానిసైన కుమారుడి హత్య..
క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడిన యువకుడు రూ.కోట్లలో అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడనే ఆక్రోశంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. -
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలి.. 10 మందికి గాయాలు
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలుడు హైదరాబాద్లోని పాతబస్తీ భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధి తలాబ్కట్టలో విధ్వంసం సృష్టించింది. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి హఠాన్మరణం
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్బూత్కు వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి(పీవో) గుండెపోటుతో మృతి చెందారు. -
తెదేపా నేత అనుమానాస్పద మృతి
పల్నాడు జిల్లా గురజాల మండలం బూదవాడ గ్రామానికి చెందిన తెదేపా నేత దాసరి బ్రహ్మయ్య (33) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. -
ఏనుగు దాడిలో వ్యక్తి మృతి
జిల్లాలో ఏనుగుల సంచారం ఇటీవల పెరిగిపోయింది. -
తెదేపాలో చేరారని న్యాయవాది కారు దహనం
తెదేపాలో చేరారని న్యాయవాది కారుని వైకాపా నాయకులు దహనం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
కారులో కోటిన్నర వదిలేసి డ్రైవర్ పరారీ
ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న విశాఖపట్నం పోలీసులు ఓ కారులోని రూ.1.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..