రైస్‌మిల్లులో పేలిన బాయిలర్‌

Eenadu icon
By Crime News Desk Published : 30 Oct 2025 05:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సుల్తానాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రైస్‌మిల్లులో ప్రమాదవశాత్తు బాయిలర్‌ పేలి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మిల్లు నడుస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో అందులో పనిచేస్తున్న గంగారం కుమార్, తిరువల్ల రామస్వామి అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో గంగారం కుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో మిల్లులోని యంత్రాలు, ఇతర సామగ్రి ముక్కలుకాగా.. అందులోని ధాన్యం, ఇతరత్రా వంద మీటర్ల వరకు చెల్లాచెదురయ్యాయి. మిల్లు పక్కనున్న పంట పొలాల్లోనూ వ్యర్థాలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు