Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.77 లక్షల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.77 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 06 Aug 2023 11:33 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.77 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులు వేర్వేరు విమానాల్లో ఈ బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితులు బంగారాన్ని గోల్డ్‌ చైన్లు, బిస్కెట్లు, పేస్టు రూపంలోకి మార్చారు. కస్టమ్స్‌ అధికారులు నలుగురినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని