నవ వరుడి మృతి కేసులో ట్విస్ట్.. మాజీ ప్రియుడే హోం థియేటర్లో బాంబు పెట్టి..
ఛత్తీస్గఢ్లో పెళ్లైన కొన్ని రోజుల వ్యవధిలోనే నవ వరుడు మృతిచెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. అతడి మరణానికి కారణమైన హోం థియేటర్ (Home theatre)లో వధువు మాజీ ప్రియుడు బాంబు పెట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
రాయ్పుర్ (ఛత్తీస్గఢ్): పెళ్లికి బహుమతిగా వచ్చిన హోం థియేటర్ (Home theatre) పేలి నవ వరుడు మృతిచెందిన ఘటనలో సంచలన విషయం బయటపడింది. కొత్త జంటను చంపేందుకు ఆ హోం థియేటర్లో బాంబు పెట్టి గిఫ్ట్ ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. తనను కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు మాజీ ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. (Home theatre wedding gift explosion Case)
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని కబీర్ధామ్ జిల్లాలో గత ఆదివారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవికి మార్చి 31న పొరుగూరికి చెందిన ఓ యువతితో వివాహమైంది. ఆ పెళ్లిలో అతడికి ఓ హోం థియేటర్ (Home theatre) బహుమతిగా వచ్చింది. గత సోమవారం హేమేంద్ర దాన్ని బయటకు తీసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. ఆ వెంటనే హోం థియేటర్ పేలిపోయింది. ఈ ఘటనలో హేమేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి అన్న రాజ్కుమార్, ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రాజ్కుమార్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలంలో గన్పౌడర్ను గుర్తించారు. దీంతో ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అన్నదానిపై దర్యాప్తు చేపట్టగా సంచలన విషయం బయటపడింది. వధువు మాజీ ప్రియుడు, మధ్యప్రదేశ్కు చెందిన సర్జు మార్కమ్ ఉద్దేశపూర్వకంగా ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. వివాహానికి ముందు వధువు, సర్జు మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని, హేమేంద్రతో పెళ్లి నిశ్చయమైన తర్వాత నుంచి ప్రియుడిని ఆ యువతి దూరం పెట్టిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆమె పై కోపం పెంచుకున్న సర్జు.. కొత్త జంటను చంపేందుకు కుట్ర పన్నాడని పోలీసులు వెల్లడించారు. హోం థియేటర్ను కొనుగోలు చేసి అందులో బాంబును అమర్చి రిసెప్షన్ రోజున వారికి కానుకగా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడు సర్జును మంగళవారం అరెస్టు చేశారు. తానే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. నిందితుడికి అంతకుముందే మరో యువతితో వివాహమైందని దర్యాప్తులో తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్