Hyderabad: ‘మార్కెట్ బాక్స్ యాప్’ పేరుతో మోసం.. తొలిసారి భారీగా నగదు రికవరీ
మార్కెట్ బాక్స్ యాప్ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్,
హైదరాబాద్: మార్కెట్ బాక్స్ యాప్ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్, యూపీకి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురు నిందితుల నుంచి రూ.9.81కోట్ల నగదు రికవరీ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం ఇదే మొదటిసారి అని సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.
‘‘మార్కెట్ బాక్స్ యాప్ ద్వారా వ్యాపారం, పెట్టుబడి పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. 10 మంది సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్టు చేశాం. పెట్టుబడులకు రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మించారు. ఒక వ్యక్తి రూ.62లక్షలు పెట్టుబడి పెట్టి రూ.34 లక్షలు నష్టపోయారు. దాదాపు 3వేల మంది ఈ యాప్లో సభ్యత్వం తీసుకున్నారు. కాగా, మార్కెట్ బాక్స్ యాప్ సెబీలో నమోదు కాలేదు’’ అని సీపీ వెల్లడించారు. బ్యాంకులు, పెట్టుబడి సంస్థల పేరుతో ఫోన్, మెయిల్కు వచ్చే సందేశాలను నమ్మొద్దని ప్రజలకు సీపీ సూచించారు. అధిక లాభాలకు ఆశపడి మోసపోవద్దని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.