Crime: కన్నతల్లిపై ఓ న్యాయవాది కర్కశత్వం
న్యాయవాదిగా పని చేస్తున్న ఓ వ్యక్తి తల్లిని చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
చండీగఢ్: వృద్ధాప్యంలో ఉన్న తల్లికి అండగా నిలవాల్సిన కుమారుడే ఆమె పాలిట రాక్షసంగా ప్రవర్తించాడు. తోటి కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన పంజాబ్ (Punjab)లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
రూప్నగర్లో నివాసముంటున్న అంకుర్ వర్మ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడి తండ్రి గుండెపోటుతో మరణించారు. మరోవైపు అంకుర్ తల్లి మానసిక స్థితి కూడా బాగోలేదు. అయితే అతడి కుటుంబ సభ్యులు తరచూ ఆ వృద్ధురాలిని వేధించడం మొదలుపెట్టారు. అంకుర్ కుమారుడు తన నానమ్మ బయటకు వెళ్లిన సమయంలో.. ఆమె బెడ్పై నీరు పోశాడు. పైగా ఆ వృద్ధురాలిపై తండ్రికి ఫిర్యాదు చేశాడు.
ప్రాణాలు పోతున్నా.. 48 మందిని కాపాడాడు
దీంతో ఆగ్రహానికి గురైన అంకుర్ విచక్షణ కోల్పోయి తల్లిపై దాడికి దిగాడు. ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత అంకుర్ సోదరి దీప్షిఖా తల్లిని చూసేందుకు వచ్చింది. ఆ వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి చూసి అనుమానంతో గదిలో ఉన్న సీసీటీవీ పరిశీలించడంతో విషయం తెలిసింది. దీంతో దీప్షిఖా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..