Vizag: మధురవాడలో మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన జనం
విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. దీంతో బాటిళ్ల కోసం జనం ఎగబడ్డారు.
మధురవాడ: విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి నచ్చినట్లు వారు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మధురవాడ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది. -
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. -
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
-
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్
-
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు