Jammu Kashmir: పెళ్లికి నిరాకరించిందని.. మహిళను చంపి.. ముక్కలుగా నరికిన వ్యక్తి!
దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జమ్ము కశ్మీర్(Jammu kashmir)లో ఓ వ్యక్తి మహిళను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చి పెట్టాడు.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్(Jammu kashmir)లో దారుణం చోటుచేసుకుంది. బుడ్గామ్ (Budgam) జిల్లాలో ఓ వ్యక్తి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య ఘటన తరహాలో హత్య అనంతరం బాధితురాలి శరీరాన్నిముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చిపెట్టాడు. దీంతో నిందితుణ్ని ఉరి తీయాలని బాధితురాలి తరపు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 7 తేదీన సోయ్బగ్ (Soibug) గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ మార్చి 7న కోచింగ్ క్లాసుల కోసం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో మార్చి 8న ఆమె సోదరుడు తన్వీర్ అహ్మద్ ఖాన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన సోదరి కనిపించకుండా పోవడానికి అదే గ్రామానికి చెందిన షాబిర్ అహ్మద్ వానీ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో షాబిర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
మహిళను నిందితుడు హత్య చేయడానికి గల కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడు గతంలో ఆమెను వివాహం చేసుకునేందుకు పలుమార్లు సంప్రదించగా.. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. హత్య అనంతరం ఆధారాలు దొరకుండా ఉండేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పూడ్చి పెట్టినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం శరీర భాగాల్ని స్వాధీనపరుచుకుని, వైద్య పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు, కొద్ది రోజుల క్రితం కంప్యూటర్ కోర్సులో చేరిందని, ఆమెకు ఆగస్టులో వివాహం జరగాల్సి ఉండగా, ఇంతలో దారుణం జరిగిందని ఆమె సోదరుడు వాపోయాడు. నిందితుణ్ని కఠినంగా శిక్షిచాలని బాధితురాలి తరపు బంధువులు రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం