Jammu Kashmir: పెళ్లికి నిరాకరించిందని.. మహిళను చంపి.. ముక్కలుగా నరికిన వ్యక్తి!
దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జమ్ము కశ్మీర్(Jammu kashmir)లో ఓ వ్యక్తి మహిళను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చి పెట్టాడు.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్(Jammu kashmir)లో దారుణం చోటుచేసుకుంది. బుడ్గామ్ (Budgam) జిల్లాలో ఓ వ్యక్తి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య ఘటన తరహాలో హత్య అనంతరం బాధితురాలి శరీరాన్నిముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చిపెట్టాడు. దీంతో నిందితుణ్ని ఉరి తీయాలని బాధితురాలి తరపు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 7 తేదీన సోయ్బగ్ (Soibug) గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ మార్చి 7న కోచింగ్ క్లాసుల కోసం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో మార్చి 8న ఆమె సోదరుడు తన్వీర్ అహ్మద్ ఖాన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన సోదరి కనిపించకుండా పోవడానికి అదే గ్రామానికి చెందిన షాబిర్ అహ్మద్ వానీ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో షాబిర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
మహిళను నిందితుడు హత్య చేయడానికి గల కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడు గతంలో ఆమెను వివాహం చేసుకునేందుకు పలుమార్లు సంప్రదించగా.. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. హత్య అనంతరం ఆధారాలు దొరకుండా ఉండేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పూడ్చి పెట్టినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం శరీర భాగాల్ని స్వాధీనపరుచుకుని, వైద్య పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు, కొద్ది రోజుల క్రితం కంప్యూటర్ కోర్సులో చేరిందని, ఆమెకు ఆగస్టులో వివాహం జరగాల్సి ఉండగా, ఇంతలో దారుణం జరిగిందని ఆమె సోదరుడు వాపోయాడు. నిందితుణ్ని కఠినంగా శిక్షిచాలని బాధితురాలి తరపు బంధువులు రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య