Praneeth Rao: ప్రణీత్‌రావును కస్టడీకి తీసుకున్న పోలీసులు

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందు కోసం సిబ్బంది చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు.

Published : 17 Mar 2024 11:03 IST

హైదరాబాద్‌: ఆధారాల ధ్వంసం కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందు కోసం సిబ్బంది చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని ఏడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు.  

గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని పెన్‌డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్‌డిస్కులను ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని