Praneeth Rao: ప్రణీత్రావును కస్టడీకి తీసుకున్న పోలీసులు
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందు కోసం సిబ్బంది చంచల్గూడ జైలుకు చేరుకున్నారు.
హైదరాబాద్: ఆధారాల ధ్వంసం కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందు కోసం సిబ్బంది చంచల్గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని ఏడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు.
గత ప్రభుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని పెన్డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్డిస్కులను ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.